Begin typing your search above and press return to search.

దేవిశ్రీ వాళ్లతో చేస్తే బావుణ్నుఅనుకున్నాడట

By:  Tupaki Desk   |   28 Nov 2015 7:31 AM GMT
దేవిశ్రీ వాళ్లతో చేస్తే బావుణ్నుఅనుకున్నాడట
X
దేవిశ్రీ ప్రసాద్ హీరో అయ్యే విషయమై చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. హీరో ఎప్పుడవుతారని అడిగినపుడల్లా.. చాలా మంది అడిగారు, అడుగుతున్నారు.. నాకు సూటయ్యే దర్శకుడి కోసం చూస్తున్నా అని చెప్పేవాడు దేవి. రెండు వారాల కిందట ‘కుమారి 21 ఎఫ్’ ప్రమోషన్ కోసం వచ్చినపుడు కూడా దేవికి ఇదే ప్రశ్న ఎదురైంది. చూద్దాం చేద్దాం అని అని సమాధానం దాటవేశాడు దేవి. ఐతే ఇంతలోనే సుకుమార్ దర్శకత్వంలో... దిల్ రాజు నిర్మాణంలో.. దేవి హీరోగా సినిమా చేయబోతున్న సంగతి వెల్లడైంది. మరి ఈ సమయంలో దేవి ఫీలింగ్ ఏంటి? హీరో కాబోతుండటంపై అతనేమంటున్నాడు? అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘దాదాపు దశాబ్దం కిందట్నుంచి నన్ను హీరోగా చేయమని అడుగుతున్నారు. కానీ ఏదో హీరో అయ్యామంటే అయ్యాం అనిపించుకోకుండా నేను చేయాల్సిన సినిమా అయితేనే చేద్దామని ఎదురు చూస్తున్నా. ఐతే హీరోగా చేస్తే సుకుమార్ లాంటి దర్శకుడితో, దిల్ రాజు లాంటి నిర్మాతతో చేస్తే బాగుంటుందనే అనుకునే వాణ్ని. కానీ వాళ్లను అడగలేదు. ఐతే మనసులో ఏదైనా బలంగా కోరుకుంటే అది జరిగి తీరుతుందని అంటారు. అలాగే నేను కోరుకున్నట్లే వీళ్లిద్దరూ కలిసి నాతో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నా జీవితంలో ఇది మోస్ట్ మెమొరబుల్ డే అనుకుంటున్నా. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నేను హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా నిర్మించబోతున్నానని దిల్ రాజు లాంటి నిర్మాత ప్రకటించడం కలలా ఉంది’’ అన్నాడు దేవి.