Begin typing your search above and press return to search.
వారిపై మండిపడుతున్న దీపికా!
By: Tupaki Desk | 18 Oct 2017 4:58 PM GMTబాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పద్మావతి చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఆ స్థాయి చిత్రంగా దీనిని రూపొందించడం కోసం దర్శక నిర్మాతలు అష్టకష్టాలు పడ్డారు. అయితే, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి దర్శక నిర్మాతలను వివాదాలు వెంటాడుతున్నాయి. పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ కొంతమంది భన్సాలీపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలుంటే చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని శ్రీ రాజ్ పుత్ కర్నీ సేన హెచ్చరికలు కూడా చేసింది. తాజాగా, ఓ షాపింగ్ మాల్ వద్ద `పద్మావతి` రంగోలీ డిజైన్ ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చెరిపి వేశారు. ఈ ఘటనపై ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే మండిపడింది. ట్విట్టర్లో ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై విరుచుకుపడింది.
సూరత్ లోని ఓ షాపింగ్ మాల్ వద్ద రంగోలీ ఆర్టిస్ట్ కరణ్ పద్మావతి లుక్ లో ఉన్న దీపికా పదుకొనే ముగ్గును వేశాడు. దాదాపుగా 48 గంటలు కష్టపడి ఆ డిజైన్ ను పూర్తి చేశాడు. అయితే, డ్రాయింగ్ వేయడం పూర్తయిన కొద్ది సేపటికే `జై శ్రీరాం` అనుకుంటూ కొంతమంది వ్యక్తులు వచ్చి ముగ్గును చెరిపివేశారు. ఈ చర్యకు పాల్పడ్డవారిపై అసహనం వ్యక్తం చేస్తూ కరణ్ ట్వీట్ చేశాడు. కరణ్ ట్వీట్లకు దీపికా రీట్వీట్లు చేసింది. `కరణ్ రంగోలీపై జరిగిన దాడి నిజంగా అమానుషం. ఎవరు వీళ్లంతా? ఇలాంటి వారిని ఇంకెంతకాలం సహించాలి? చట్టాలను వారి చేతిలోకి తీసుకుని మన స్వేచ్ఛా హక్కు మీద దాడి చేయడం ఏంటి? ఇటువంటి చర్యలకు చరమగీతం పాడాలి. స్మృతీ ఇరానీ గారు ...వారిపై ఏదైనా చర్య తీసుకోండి` అని దీపికా ట్వీట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి గతంలో కూడా వివాదాలు వచ్చాయి. ఈ చిత్రంలో ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రదర్శనను అడ్డుకుంటామని శ్రీ రాజ్ పుత్ కర్నీ సేన చెబుతోంది. అయితే, ముందుగా సినిమా చూడాలని భన్సాలీ కోరారు. ముందు చరిత్రకారులకు సినిమా చూపించాలని, వారు చెబితే తాము నమ్ముతామని శ్రీ రాజ్పుత్ కర్నీ సేన తెలిపింది. ఈ విషయంపై నిర్మాతల పక్షం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూరత్ లోని ఓ షాపింగ్ మాల్ వద్ద రంగోలీ ఆర్టిస్ట్ కరణ్ పద్మావతి లుక్ లో ఉన్న దీపికా పదుకొనే ముగ్గును వేశాడు. దాదాపుగా 48 గంటలు కష్టపడి ఆ డిజైన్ ను పూర్తి చేశాడు. అయితే, డ్రాయింగ్ వేయడం పూర్తయిన కొద్ది సేపటికే `జై శ్రీరాం` అనుకుంటూ కొంతమంది వ్యక్తులు వచ్చి ముగ్గును చెరిపివేశారు. ఈ చర్యకు పాల్పడ్డవారిపై అసహనం వ్యక్తం చేస్తూ కరణ్ ట్వీట్ చేశాడు. కరణ్ ట్వీట్లకు దీపికా రీట్వీట్లు చేసింది. `కరణ్ రంగోలీపై జరిగిన దాడి నిజంగా అమానుషం. ఎవరు వీళ్లంతా? ఇలాంటి వారిని ఇంకెంతకాలం సహించాలి? చట్టాలను వారి చేతిలోకి తీసుకుని మన స్వేచ్ఛా హక్కు మీద దాడి చేయడం ఏంటి? ఇటువంటి చర్యలకు చరమగీతం పాడాలి. స్మృతీ ఇరానీ గారు ...వారిపై ఏదైనా చర్య తీసుకోండి` అని దీపికా ట్వీట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి గతంలో కూడా వివాదాలు వచ్చాయి. ఈ చిత్రంలో ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రదర్శనను అడ్డుకుంటామని శ్రీ రాజ్ పుత్ కర్నీ సేన చెబుతోంది. అయితే, ముందుగా సినిమా చూడాలని భన్సాలీ కోరారు. ముందు చరిత్రకారులకు సినిమా చూపించాలని, వారు చెబితే తాము నమ్ముతామని శ్రీ రాజ్పుత్ కర్నీ సేన తెలిపింది. ఈ విషయంపై నిర్మాతల పక్షం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.