Begin typing your search above and press return to search.

కొత్త సినిమాలో మ‌హేష్ మ‌ద‌ర్ ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   24 July 2016 9:39 AM GMT
కొత్త సినిమాలో మ‌హేష్ మ‌ద‌ర్ ఎవ‌రో తెలుసా?
X
స్టార్ క‌థానాయ‌కుల సినిమాల్లో చిన్న పాత్ర గురించి కూడా పెద్ద‌ చ‌ర్చ జ‌రుగుతుంటుంది. ఆ ఎక్స్‌ పోజ‌ర్ అలా ఉంటుంది. ఇక స్టార్ క‌థానాయ‌కులకు అమ్మానాన్న‌ల పాత్ర‌లంటే ఎంత ప్ర‌త్యేక‌మో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌హేష్‌ లాంటి సూప‌ర్‌ స్టార్ సినిమా సెట్స్‌ పైకి వెళుతున్న‌ప్పుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అమ్మానాన్న‌ల పాత్ర‌ల గురించి ప్ర‌త్యేక‌మైన క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. మ‌హేష్ అందానికి త‌గ్గ న‌టుల్నే ఎంపిక చేసుకొని ఆయ‌న‌కి పేరెంట్స్‌ గా చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. మొన్న‌టి శ్రీమంతుడు సినిమాలో మ‌హేష్‌కి అమ్మానాన్న‌లుగా జ‌గ‌ప‌తిబాబు - సుక‌న్య నటించారు. బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో స‌త్య‌రాజ్‌ - రేవ‌తి నటించారు.

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే కొత్త చిత్రంలోనూ మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ కోసం ఓ విల‌క్ష‌ణ‌మైన న‌టిని ఎంపిక చేసుకొన్నారు. ఆమె పేరు... దీపా రామానుజం. త‌మిళంలో బుల్లితెర‌పై ఫేమ‌స్ అయింది. ఆ త‌ర్వాత ప‌సంగ 2 - ఇదు న‌మ్మ ఆళు - ర‌జ‌నీ మురుగ‌న్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకొంది. ఆమెనే మ‌హేష్‌ కి మ‌ద‌ర్‌ గా చూపించ‌బోతున్నాడు మురుగదాస్‌. మ‌రి ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌కి కూడా త‌మిళ‌న‌టుడినే ఎంచుకొంటాడా? లేదంటే తెలుగు న‌టుల్ని చూపించ‌బోతున్నాడా? అన్న‌ది చూడాలి. అన్న‌ట్టు ఈ చిత్రంలో ఇప్ప‌టికే విల‌న్‌ గా ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య‌ని ఎంపిక చేసుకొన్నాడు మురుగ‌. చూస్తుంటే సినిమాలో త‌మిళ న‌టుల‌కే పెద్ద పీట వేసిన‌ట్టు తెలుస్తోంది.