Begin typing your search above and press return to search.

బాహుబలిపై అతిపెద్ద క్లారిటీ..

By:  Tupaki Desk   |   25 Nov 2015 4:30 AM GMT
బాహుబలిపై అతిపెద్ద క్లారిటీ..
X
బాహుబలి సినిమా ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై ప్రశంసలతో పాటూ రానున్న పార్ట్ పై పుకార్లు ఎక్కువైపోయాయి. ద్వితీయభాగంలో సూర్య - శ్రియ - లావణ్య వంటి తారలకు చోటు దక్కిందంటూ రకరకాల కధనాలు వినిపించాయి. అయితే మా సినిమాలో ఇప్పటివరకూ ఎవరి పాత్రలు కొత్తగా సృష్టించలేదని నిర్మాత స్పష్టం చేయడంతో సినిమాపై నెలకొన్న ఊహాగానాలు తొలగిపోయాయి.

అయితే మొదటి భాగంపై ప్రేక్షకులు స్పందించిన తీరు కారణంగా రెండవ భాగంలో కధలో చిన్నపాటి మార్పులు చేశామని స్పష్టం చేశారు. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయిన నేపధ్యంలో సినిమాను వచ్చే ఏడాది చివర్లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.

అయితే ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఈ రెండవ భాగాన్ని మరో పావు శాతం ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్టు స్పష్టం చేశారు. గ్రాఫిక్స్ ని అత్యున్నత పరిమాణాలతో తెరకెక్కించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెండవ భాగం షూటింగ్ వచ్చే నెల నుండి లాంచనంగా ప్రారంభంకానుంది.