Begin typing your search above and press return to search.

ఆ పని కావాలని చేసింది కాదంటున్న చిరు!

By:  Tupaki Desk   |   10 Jan 2017 4:34 AM GMT
ఆ పని కావాలని చేసింది కాదంటున్న చిరు!
X
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈమద్య అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో చిరు ఎమోషన్స్, నాగబాబు స్పెషల్ స్పీచ్, పవన్ గైర్హాజరీ, దాసరి పలుకులు, టీఎస్సార్ గుడ్ న్యూస్ లతో సందడి సందడిగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని ఒక ఐలాండ్ లో జరుపడం, జరుపుకోవాల్సి రావడంపై మెగాభిమానులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా విజయవాడలో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో చేయాలని భావించినా, ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు! దీనికి గల కారణాలపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.

ఖైదీ నంబరు 150 సినిమా బుధవారం ప్రేక్షకుల మందుకు రానున్నసందర్భంగా విలేకరులతో పలు విషయాలపై ముచ్చటించిన చిరు... ఈ సందర్భంగా విజయవాడలో వేడుక నిర్వహణకు స్టేడియం ఇవ్వకపోవడంపై స్పందించారు. తమ కార్యక్రమానికి వేడుక ఇవ్వకపోవడం అనేది కావాలని చేసిందని అనుకోవడం లేదని అన్నారు. దానికి కారణం కోర్టు ఉత్తర్వులేనని చిరు క్లారిటీ ఇచ్చారు. ముందుగా అనుమతులు ఇచ్చిన సమయంలో కోర్టు ఉత్తర్వులు మర్చిపోయి అనుమతి ఇచ్చామనీ, అనంతరం కోర్ట్ ఆర్డర్ గుర్తుకొచ్చి ఆ అనుమతిని వెనక్కి తీసుకున్నారని తనకు పోలీసులుల్ తెలిపారని చెరు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలీసులు... ఈ కార్యక్రమానికి స్టేడియం మొత్తం ఇవ్వలేమనీ, కొంత ప్రదేశానికి మాత్రమే అనుమతి ఇవ్వగలమని తెలిపారని చిరు అన్నారు. అయితే, బయట ప్రచారంలో ఉన్నట్లుగా ఎవరో కావాలని ఇదంతా చేసినట్టు తాను నమ్మడంలేదని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు.

ఏది ఏమైనా.. చిరంజీవే స్వయంగా ఇంత క్లారిటీ ఇచ్చినా.. ప్రభుత్వం అనుకుంటే ఈ కార్యక్రమానికి అనుమతి వచ్చి ఉండేదని, ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ కార్యక్రమం నగరంలో జరగకుండా చేసిందని, దానికి సామాజిక, రాజకీయ కారణాలే కారణమని వాదించేవారు వాదిస్తూనే ఉన్నారు!! కాగా, ఈ నెల 11వ తేదీన చిరంజీవి ఖైదీ నంబర్ 150 ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, మరుసటిరోజు బాలయ్య వందోసినిమా గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలవుతున్న సంగతి తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/