Begin typing your search above and press return to search.

సెక్స్ రాకెట్: కిషన్ దోషే.. తేల్చిన కోర్టు

By:  Tupaki Desk   |   15 July 2018 6:49 AM GMT
సెక్స్ రాకెట్: కిషన్ దోషే.. తేల్చిన కోర్టు
X

అమెరికా కేంద్రంగా టాలీవుడ్ తారలను తీసుకొచ్చి సెక్స్ రాకెట్ నడిపిన కిషన్ మోదుగుమూడి కేసు క్లైమాక్స్ కు వచ్చింది. ఈ వ్యవహారంలో అమెరికా కోర్టులో విచారణ ముగిసింది. ప్రధాన నిందితుడిగా ఉన్న కిషన్ దంపతులను ఉత్తర ఇలినాయిస్ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో జూలై 18న తుది తీర్పు వెల్లడించనున్నట్టు కోర్టు తెలిపింది. వీరికి దాదాపు పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు.

కిషన్ మోదుగుమూడి సెక్స్ రాకెట్ లో పోలీసులు పక్కా ఆధారాలు సంపాదించారు. తెలుగు సినిమా, టీవీ రంగానికి చెందిన పలువురు తారలను విచారించి కిషన్ వ్యభిచారం చేయించాడని పక్కా సాక్ష్యాలతో కోర్టులో రుజువుచేశారు. ఐదుగురు హీరోయిన్ల సాక్ష్యాలను, వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయిన డాలర్లు, వారి ప్రయాణ తేదీల వివరాలతో పాటు కిషన్ ఇంట్లో లభ్యమైన పలు కీలక సాక్ష్యాలను అమెరికా పోలీసులు కోర్టుకు సమర్పించారు.

వ్యభిచారం కేసుతోపాటు వీసా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కూడా కిషన్ దంపతులకు శిక్ష పడనుంది. రెండు నేరాలకు కలిపి శిక్షను జూలై 18న వెల్లడించనున్నట్టు న్యాయమూర్తులు తెలిపారు. దాదాపు 10 ఏళ్లు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం జైలు శిక్ష పూర్తయ్యాకే కిషన్ దంపతులు ఇండియాకు తిరిగి రానున్నారు.

*కేసు పూర్వపరాలు..

కిషన్ మోదుగుమూడి-చంద్ర దంపతులు అమెరికాలో జరిగే తెలుగు సంఘాల ఈవెంట్లలో సినీ తారలను విజిటింగ్ వీసాలపై రప్పించి వారితో వ్యభిచారం చేయించేవారు. 2017 నవంబర్ 8న క్యాలిఫోర్నియాలో జరిగే ఓ స్టార్ నైట్ ప్రోగ్రాంకు రెండు రోజులు ఆలస్యంగా వచ్చిన హీరోయిన్ పై పోలీసులు అనుమానం వచ్చింది. ఆమెను గట్టిగా విచారించడంతోకిషన్ సెక్స్ రాకెట్ బయటపడింది.