Begin typing your search above and press return to search.

మైత్రి మైకంలో గోపి కథ క్యాన్సిల్?

By:  Tupaki Desk   |   15 May 2018 1:48 AM GMT
మైత్రి మైకంలో గోపి కథ క్యాన్సిల్?
X
ఒక్కడున్నాడు సినిమాతో ఒకటైన హీరో గోపిచంద్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మంచి కాంబినేషన్ అని నీరూపించుకున్నారు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ దర్శకుడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక రెండవసారి సాహసం తో ఒకటైన ఆ కాంబో మంచి కమర్షియల్ హిట్ అందుకోవడంతో క్రేజ్ ఏర్పడింది. అయితే మూడవసారి కూడా ఆ కాంబో ఒకటి కాబోతోంది అని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సాయి ధరమ్ తేజ్ తో లాక్ చేసుకున్న ప్రాజెక్టును చంద్రశేఖర్ ఆ తరువాత గోపిచంద్ కి షిఫ్ట్ చేసినట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి. మరికొన్ని రోజుల్లో గోపి ప్రాజెక్ట్ పట్టలేక్కుతుందని అంతా అనుకుంటున్న సమయంలో మైత్రి రాకతో తారుమరయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఎందుకంటే గోపితో సినిమా సెట్స్ పైకి రావడానికి సమయం చాలా పట్టేలా ఉందని దర్శకుడికి మైత్రి మూవీ మేకర్స్ వారు అడ్వాన్స్ ఇచ్చి ఓ కుర్ర హీరో కోసం కథ రెడీ చేయమన్నట్లు టాక్.

దీంతో దర్శకుడు ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ మైకంలో పడి గోపిచంద్ ప్రాజెక్టుని పక్కనపెట్టేశాడట. త్వరలో నాని లేదా అఖిల్ వంటి కుర్రహీరోల డేట్స్ ని వీలైనంత త్వరగా ఫిక్స్ చేసుకొని చంద్రశేఖర్ కథను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ప్రస్తుతం గోపిచంద్ పంతం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది.