Begin typing your search above and press return to search.

అమ‌ర‌నాథ్ యాత్ర నేప‌థ్యంలో కార్తికేయ‌కి సీక్వెల్

By:  Tupaki Desk   |   1 Dec 2015 3:15 PM GMT
అమ‌ర‌నాథ్ యాత్ర నేప‌థ్యంలో కార్తికేయ‌కి సీక్వెల్
X
గ‌తేడాది చిన్న సినిమాగా వ‌చ్చి బాక్సాఫీసు ద‌గ్గ‌ర అద్భుతాలు సృష్టించింది... కార్తికేయ‌. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మ‌ది. ఆ క్రేజీ కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లోనే మ‌రో చిత్రం తెర‌కెక్క‌బోతోంది. అది కూడా కార్తికేయ‌కి సీక్వెల్‌గా ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం నాగ‌చైత‌న్య‌తో `ప్రేమ‌మ్‌`ని రీమేక్ చేస్తున్న చందు త‌దుప‌రి కార్తికేయ సీక్వెల్‌నే తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. కార్తికేయకీ, ప్రేమ‌మ్‌కీ మ‌ధ్య వ‌చ్చిన గ్యాప్‌లోనే చందు మొండేటి ఈ స్క్రిప్టును త‌యారు చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఆ విష‌యాన్ని క‌థానాయ‌కుడు నిఖిల్ కూడా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ధృవీక‌రించాడు. చందు మొండేటి బౌండెడ్ స్క్రిప్టుతో సిద్ధమ‌య్యాడ‌న్న విష‌యాన్ని తెలుసుకొన్న ఓ అగ్ర నిర్మాత ఇప్ప‌టికే ఆయ‌న‌తో సంప్ర‌దింపులు కూడా మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది.

తొలి చిత్రాన్ని గుడి చుట్టూ న‌డిపిన చందు ఈసారి అమ‌రనాథ్ యాత్ర నేప‌థ్యంలో స్క్రిప్టు త‌యారు చేశాడ‌ట. ఒక గుడి చుట్టూనే అంత బ‌ల‌మైన క‌థ రాసిన చందు... అమ‌ర‌నాథ్ యాత్ర నేప‌థ్యంలో అంటే ఇంకెలాంటి క‌థ‌ని త‌యారు చేసుంటాడో మ‌రి!. అయితే ఈసారి మాత్రం `కార్తికేయ‌`లా కాకుండా భారీస్థాయిలోనే చిత్రాన్ని తెర‌కెక్కించాల‌న్న‌ది చందు మొండేటి ఆలోచ‌న‌గా తెలుస్తోంది. స్క్రిప్టుని చూసి నిఖిల్ ఎప్పుడెప్పుడు చేసేద్దామా అన్న ఉత్సాహంలో ఉన్నాడ‌ట‌.