Begin typing your search above and press return to search.

చిరుకి స్కెచ్ వేస్తే చరణ్‌ పడ్డాడు

By:  Tupaki Desk   |   16 Oct 2017 9:51 AM GMT
చిరుకి స్కెచ్ వేస్తే చరణ్‌ పడ్డాడు
X
నిజానికి ''సరైనోడు'' సినిమా చూసిన తరువాత స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి కూడా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎందుకంటే అసలు అల్లు అర్జున్ తో అప్పటివరకు ఏ దర్శకుడూ కూడా హ్యాండిల్ చేయని రీతిలో మాస్ యాక్షన్ ను పండించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అందుకే ఈ దర్శకుడితో తను కూడా ఒక మాస్ ఫిలిం చేయాలని అనుకున్నాడు. కాని ''ధృవ'' సినిమా చూసి సురేందర్ రెడ్డి టాలెంటుకు ఫిదా అయిపోయి.. ''సైరా'' సినిమాను అతగాని చేతిలో పెట్టేశారు మెగాస్టార్.

ఈలోపు బోయపాటి కూడా ''జయ జానకి నాయక'' అంటూ ఒక సినిమాతో వచ్చేశాడు. తరువాత చిరంజీవికి ఒక కద చెప్పినా కూడా.. అది ఆయన్ను అంతగా ఆకట్టుకోలేదు. మరి ఎలాగో చిరంజీవి కూడా ఖాళీగా లేరు కాబట్టి.. ఎవరితో సినిమా చేస్తాడా అని అనుకుంటున్న వేళ.. అయితే మహేష్‌ బాబుతో మాస్ లవ్ స్టోరీ.. లేదంటే బాలయ్యతో కలసి సింహా లేదా లెజెండ్ సినిమాలకు సీక్వెల్ తీస్తాడని టాక్ వచ్చింది. కాని ఆశ్చర్యకరంగా రామ్ చరణ్‌ కు ఒక కథను చెప్పాడట ఈ యాక్షన్ స్పెషలిస్ట్. ఆల్రెడీ ధృవ అండ్ రంగస్థలం వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న చరణ్‌ కు.. ఓసారి మాస్ వైపు మరోసారి వెళ్ళొద్దాం అని అనిపించడంతో.. వెంటనే బోయపాటితో సినిమా చేసేద్దాం అని డిసైడ్ చేసుకున్నాడని టాక్.

పైగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటే.. ఇప్పటికే చరణ్‌ తన తదుపరి సినిమాను వేరే నిర్మాతకు కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి.. ఆ నిర్మాతతో చేద్దాం అని ఫిక్సయిపోయాడట. ఏదేమైనా కూడా.. సరైనోడు తరువాత బోయపాటి మెగా క్యాంపులో మరోసారి అడుగపెట్టి సంచలనం సృష్టించేలా ఉన్నాడు.