Begin typing your search above and press return to search.

మరీ ఇంత దారుణమైన కామెంట్లా?

By:  Tupaki Desk   |   24 July 2017 9:14 AM GMT
మరీ ఇంత దారుణమైన కామెంట్లా?
X
సెలబ్రిటీల మాటల్లో చిన్న తేడా వస్తేనే మీడియాలోనూ.. సోషల్ నెట్ వర్కుల్లోనూ రచ్చరచ్చ అయిపోతుంది. అందుకే వీలైనంత వరకు చాలామంది ఆచితూచి మాట్లాడతారు. లేదంటే నలుగురి నోళ్లలోనూ నాని అనవసరంగా పరువు పోగొట్టుకోవాల్సి ఉంటుందని సంకోచిస్తారు. ఇంకొందరు ఉంటారు.. పనిగట్టుకుని వివాదాస్పద కామెంట్లు చేస్తుంటారు. బాలీవవు్ కమాల్ ఆర్.ఖాన్ అని ఒకడున్నాడు. ఎవడు ఫేంలో ఉంటే వాళ్లమీద రాళ్లేస్తుంటాడు.

తాజాగా బాలీవుడ్ నటి భైరవి గోస్వామి అతడికంటే రెండాకులు ఎక్కువే చదివింది. తెలుగులో మహేష్ బాబుతో కలిసి ‘‘1 నేనొక్కడినే’’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తర్వాత బాలీవుడ్ షిఫ్టయిపోయిన కృతి సనన్ ను ఉద్దేశించి ట్విట్టర్ లో భైరవి గోస్వామి చాలా దారుణమైన కామెంట్లు చేసింది. ‘‘అసలు ఆమె యాక్టర్ ఎలా అయింది? హెడ్ లైట్ లేదు.. బంపర్ లేదు. కాలేజ్ స్టూడెంట్స్ ఆమెకన్నా చాలా బెటర్ గా కనిపిస్తారు’’ అంటూ పోస్టింగ్ పెట్టింది. కృతి శరీర భాగాలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారాయి.

కృతి సనన్ రీసెంట్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి రాబ్తా సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా బోల్తా కొట్టింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన బరైలీ కీ బర్ఫీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతోపాటు టైగర్ ష్రాఫ్ - సల్మాన్ ఖాన్ తోనూ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ గా పేరున్న ఆమెను కించపరుస్తూ భైరవి గోస్వామి చేసిన కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు.