Begin typing your search above and press return to search.

టైగ‌ర్ పంజా విస‌ర‌డ‌మే లేటు

By:  Tupaki Desk   |   1 Dec 2015 3:12 PM GMT
టైగ‌ర్ పంజా విస‌ర‌డ‌మే లేటు
X
మాస్‌లో బ‌ల‌మైన అభిమాన‌గ‌ణాన్నిసంపాదించుకొన్న క‌థానాయ‌కుడు ర‌వితేజ‌. అందుకే ఆయ‌న్ని మాస్ మ‌హ‌రాజ్ అని పిలుచుకుంటుంటారు అభిమానులు. ఒక‌ప్పుడు యేడాదికి మూడు నాలుగు సినిమాల‌తో అద‌ర‌గొట్టిన ర‌వితేజ కొంత‌కాలంగా ఆ జోరును త‌గ్గించేశాడు. మ‌ధ్య‌లో కొన్ని ప‌రాజ‌యాలు ఎదుర‌వ్వ‌డ‌మే అందుకు కార‌ణం. అయితే మ‌ళ్లీ `బ‌లుపు` - `ప‌వ‌ర్‌`లాంటి చిత్రాల‌తో ఫామ్‌ లో కొచ్చాడు. అదే ఫామ్‌ని అట్టాగే కంటిన్యూ చేస్తాడ‌నుకొంటే మ‌నోడేమో దారిత‌ప్పాడు. భారీ అంచ‌నాల్ని క్రియేట్ చేసిన కిక్‌2 బాక్సాఫీసు ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డిపోయింది. డిజాస్ట‌ర్‌ గా మిగిలి ర‌వితేజ‌ని మ‌ళ్లీ య‌థాస్థానానికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆ ప‌రాజ‌యంపై క‌సి తీర్చుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు ర‌వితేజ‌. అందులో భాగంగానే `బెంగాల్ టైగ‌ర్‌` చేశాడు. ఆ చిత్రం ఈ నెల 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. మంగ‌ళ‌వార‌మే సెన్సార్ పూర్త‌యింది. యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది. అంటే ఇంటిల్లిపాదీ క‌లిసి మాస్ మ‌హ‌రాజ్ చేసే సంద‌డిని చూడొచ్చ‌న్న‌మాట‌. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఇందులో త‌మ‌న్నా - రాశిఖ‌న్నా న‌టించారు. ఇద్ద‌రూ అంద‌గ‌త్తెలే కావ‌డంతో సినిమాకి కావ‌ల్సినంత క‌మ‌ర్షియాలిటీ వ‌స్తుంద‌ని చెప్పొచ్చు.