Begin typing your search above and press return to search.

బెల్లంకొండతో యాంకర్ ప్రయోగం

By:  Tupaki Desk   |   17 Jan 2018 5:00 AM GMT
బెల్లంకొండతో యాంకర్ ప్రయోగం
X
ఇంతవరకు కెరీర్ లో చేసింది మూడు సినిమాలే అయినా అందులో రెండు సీనియర్ డైరెక్టర్లు.. భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినిమా బాగా ఉందనే టాక్ తెచ్చుకున్నా స్థాయికి మించి ఖర్చు చేయడంతో అతడి నిర్మాతలు మాత్రం నష్టాలు చవిచూడక తప్పలేదు. ఈ హీరో ఇప్పుడు కాస్త రూటు కొత్తగా ట్రై చేసే పనిలో పడ్డాడు.

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో జయజానకి నాయక లాంటి మాస్ సినిమా చేశాక.. ఎంటర్ టెయిన్ మెంట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీవాస్ డైరెక్షన్ లో సాక్ష్యం మూవీ చేస్తున్నాడు సాయి శ్రీనివాస్. ఈ సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. దీని తరవాత సినిమా రాజుగారి గది ఫేం దర్శకుడు.. యాంకర్ ఓంకార్ డైరెక్షన్ లో చేయడానికి శ్రీనివాస్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. అదికూడా ఓంకార్ ఇంతకుముందు సక్సెస్ కొట్టిన హర్రర్ జోనర్ లో కాదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా స్పోర్ట్ డ్రామా అని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ తరహా సినిమా హీరో డైరెక్టర్లకే కాదు.. దాదాపుగా టాలీవుడ్ కే కొత్త. కాబట్టి ఈ ప్రయోగం కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో శ్రీనివాస్ ఉన్నాడట.

ప్రస్తుతం సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సాక్ష్యం మూవీలో డీజేతో తన అందాలతో టాలీవుడ్ ని అయస్కాంతంలా ఆకర్షించిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మార్చిలో థియేటర్లకు రానుంది. శ్రీనివాస్ పచ్చజెండా ఊపడంతో డైరెక్టర్ ఓంకార్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోకి దిగిపోయాడు. సాక్ష్యం మూవీ పనులు పూర్తయ్యేలా పక్కా స్క్రిప్ట్ తో ముందుకెళ్లడానికి ఓంకార్ సిద్ధమవుతున్నాడు. వీళ్ల ప్లాన్ ఫలిస్తే టాలీవుడ్ కు ఇంకో హిట్ జోనర్ దొరికినట్లే.