Begin typing your search above and press return to search.

బాలయ్యను కవిగా మార్చేసింది!

By:  Tupaki Desk   |   22 Oct 2018 8:38 AM GMT
బాలయ్యను కవిగా మార్చేసింది!
X
నందమూరి బాలకృష్ణ తాజాగా ‘అరవింద సమేత’ చిత్రం సక్సెస్‌ వేడుకలో పాల్గొన్న విషయం తెల్సిందే. నందమూరి అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలయిక ఈ కార్యక్రమంలో జరిగింది. ఎన్టీఆర్‌ - బాలకృష్ణలను ఒకే వేదికపై చూసి సంతోషంతో పొంగి పోయిన నందమూరి ఫ్యాన్స్‌ ను మరింత ఉత్తేజ పర్చే విధంగా బాలయ్య తన స్పీచ్‌ ను కొనసాగించాడు. హీరోయిన్‌ పూజా హెగ్డే గురించి మాట్లాడే సమయంలో బాలయ్య ఏకంగా కవిగా మారిపోయాడు. పూజా హెగ్డే గురించి హిందీలో ఒక కవితనే చెప్పి అందరికి షాక్‌ ఇచ్చాడు.

‘గ్తాహై ఆస్మాన్‌ సే ఫరిస్తా ఉతర్‌ కి స్నె, హర్‌ ఖలీ మస్తెక్హాబ్‌ హో జాతీ హై - పతి పతి గులాబ్‌ హో జాతాహై...’ అంటూ బాలయ్య పూజా హెగ్డే గురించి హిందీలో చెప్పిన ఈ కవిత స్టేజ్‌ పై ఉన్నవారినే కాకుండా అందరిని కూడా అలరించింది. ఆ సమయంలో పూజా హెగ్డేకు ఎలా రియాక్ట్‌ కావాలో అర్థం కాక నవ్వుతూ ఉండి పోయింది. మొదట ఆమెకు బాలయ్య మాట్లాడేది ఏ భాషో అర్థం కాన్నట్లుగా ఫేస్‌ పెట్టింది - ఆ తర్వాత కొన్ని సెకన్లకు తేరుకుని సిగ్గుతో నవ్వేసింది.

ఈ చిత్రంలో పూజా హెగ్డేకు మంచి పాత్ర దక్కింది. వచ్చిన మంచి అవకాశంను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పూజా హెగ్డే మంచి నటిగా నిరూపించుకుంది. ఈ చిత్రంను చూడకుండానే బాలకృష్ణ ఆమె గురించి హిందీ పద్యం చెప్పడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. మొత్తానికి బాలకృష్ణ నోటి నుండి ఇప్పటి వరకు హిందీ శ్లోకాలను మాత్రమే విన్న ప్రేక్షకులు ఇప్పుడు హిందీ పద్యాన్ని కూడా ఆస్వాదించారు.