Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌: బోరున ఏడ్చిన బాబా... శ్రీముఖి టీం ర‌చ్చ ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   14 Oct 2019 4:20 AM GMT
బిగ్‌ బాస్‌: బోరున ఏడ్చిన బాబా... శ్రీముఖి టీం ర‌చ్చ ర‌చ్చ‌
X
బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టంట్స్ లో ఒకరిగా ఉన్న బాబా భాస్కర్ బోరు బోరున ఏడ్చేశారు. ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమవ్వడమే కింగ్ నాగార్జున బాబా ఎమోషన్ అవుతున్న వీడియోని మన టీవీ ద్వారా చూపించారు. శనివారం ఎపిసోడ్ లో ఓ టాస్క్‌ లో భాగంగా శివజ్యోతి.. బాబాకు జోకర్ బొమ్మ ఇచ్చింది. అంతకముందు ఎపిసోడ్ లలో గుంట నక్క - ఊసరవెల్లి ఎవరంటే బాబా అనే చెప్పింది. ఇక ఇవన్నీ గుర్తుతెచ్చుకున్న బాబా స్మోకింగ్ రూమ్‌ లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాబాని చూసి వరుణ్ - మహేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నవ్వుతూ మాట్లాడే వాళ్ళందరూ మనవాళ్లు కాదనే మహేష్ క్లాస్ తీసుకున్నాడు.

ఆ తర్వాత మన టీవీ ద్వారా ఇంటి సభ్యులని పలకరించిన నాగార్జున బాబాని ఎందుకంత ఫీల్ అవుతున్నావ్ అని అడుగగా...ఏం లేదంటూ మళ్ళీ ఏడ్చేశారు. దీంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న నాగార్జున బాబాని ఓదార్చారు. అయితే హౌస్ మొత్తం ఎమోషనల్ అయిపోయిందని - సన్ డే అంటే ఫన్ డే అని చెబుతూ...నాగ్ ఎంటర్టైన్మెంట్ షురూ చేశారు. 8 మంది సభ్యులని రెండు టీంలు గా విభజించి ఓ టాస్క్ ఇచ్చారు. శ్రీముఖి టీంలో వితికా - అలీ - రాహుల్ లు ఉండగా - మహేష్ టీంలో బాబా - వరుణ్ - శివజ్యోతిలు ఉన్నారు.

ఒక్కో టీం నుంచి ఒక్కో కంటెస్టెంట్ వచ్చి చిట్టీ తీసి దానిపై ఏ సినిమా పేరు రాసుందో కెమెరాకు చూపించాలి. ఈ సినిమా పేరును బోర్డుపై బొమ్మల రూపంలో వేసి తన టీం సభ్యులతో చెప్పించాలి. ఈ టాస్క్‌ లో శ్రీముఖి టీం విజయం సాధించింది. గెలిచిన ప్రతిసారి ఆయా సినిమాల్లోనే పాటలకు శ్రీముఖి టీం డ్యాన్సులు ఇరగదీశారు. మహేష్ టీంని ఆటపట్టిస్తూ...పాటకి తగిన విధంగా స్టెప్పులు వేసి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేశారు.