Begin typing your search above and press return to search.

శాతకర్ణిని ఫాలో అవుతున్న క్రికెటర్లు!

By:  Tupaki Desk   |   25 Oct 2016 10:15 AM GMT
శాతకర్ణిని ఫాలో అవుతున్న క్రికెటర్లు!
X
ఒక వ్యక్తి తన పేరుని ఏ సందర్భంలో చెప్పుకోవాల్సి వచ్చినా "సన్ ఆఫ్" అంటూ తన తండ్రి పేరుని మాత్రమే చెప్పటం ఒక ఆనవాయితీ అయ్యింది. ఈ విషయంలో బుద్దుడు తన తల్లి పేరుని కలుపుకొని గౌతమ బుద్దుడైతే... తొలి శాతవాహనుల్లో చివరి రాజు తన తల్లి గౌతమీ బాలాశ్రీ పేరుని తన పేరు ముందు చేర్చుకొని "గౌతమీపుత్ర శాతకర్ణి" అయ్యాడు. ఆ రాజు కథనే ఇతివృత్తంగా చేసుకొని నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక తన 100వ చిత్రం "గౌతమి పుత్ర శాతకర్ణి" ని క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే! ఆ శాతకర్ణినే ఫాలో అవుతూ ఇటీవల "బసవతారక పుత్ర బాలకృష్ణ" అని పేరు వేయించుకున్నాడు బాలకృష్ణ. అయితే... ఇప్పుడు టీమిండియా క్రికెటర్లు ఇదే ఫాలో అవుతున్నారు.

టీం ఇండియా క్రికెటర్లు ఎంఎస్‌ ధోనీ - విరాట్‌ కోహ్లీ - అజింక్యా రహానేలు బాలయ్య పనినే ఫాలో అవుతూ తమ జెర్సీలపై తల్లుల పేర్లును ముద్రించుకున్నారు. ధోనీ తన తల్లి పేరు దేవకీని జెర్సీపై ముద్రించుకోగా... విరాట్ తన తల్లి పేరు సరోజ్‌ - రహానే తన తల్లి పేరు సుజాతను తమ జెర్సీలపై ముద్రించుకున్నారు. బీసీసీఐ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక "మా కా నామ్‌" క్యాంపెయిన్‌ లో భాగంగా వీరు ముగ్గురూ తమ జెర్సీలపై తల్లి పేర్లను ముద్రించుకుని కనిపించారు. ఈ క్యాంపెయిన్‌ సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయింది. ఏది ఏమయినా ఇలా మాతృమూర్తి కి గౌరవం ఇవ్వడం ఆహ్వానించ దగిన, హర్షించదగిన విషయం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/