Begin typing your search above and press return to search.

ది రిటర్న్ ఆఫ్‌ బిగ్ ప్రొడ్యూసర్

By:  Tupaki Desk   |   15 May 2018 7:05 AM GMT
ది రిటర్న్ ఆఫ్‌ బిగ్ ప్రొడ్యూసర్
X
స్టార్ హీరోల‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన బ్యాన‌ర్ వైజ‌యంతీ మూవీస్‌. మూడేళ్లుగా ఒక్క సినిమాను ఆ బ్యాన‌ర్ పై నిర్మించ‌లేదు. ఇప్పుడు మ‌హాన‌టితో విజ‌యంతో మ‌ళ్లీ పూర్వ వైభ‌వాన్ని పొందింది. త్వ‌ర‌లో వ‌రుస‌పెట్టి స్టార్ హీరోల‌తో సినిమాలు తీసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌హేష్ బాబు - జూనియ‌ర్ ఎన్టీఆర్‌ తో పాటూ చిరంజీవి హీరోగా పెట్టి సినిమా తీయాల‌ని భావిస్తున్నారు అశ్వ‌నీద‌త్‌.

అల్లు అర్జున్ జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌హేష్ బాబు రామ్ చ‌ర‌ణ్ వీరంద‌రూ ప‌రిచ‌యం అయింది వైజ‌యంతీ మూవీస్ ద్వారానే. వారి తొలి సినిమాల‌న్నింటి నిర్మాత అశ్వ‌నీదత్‌. చిరంజీవితో ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఘ‌న చ‌రిత్ర ఉంది ఈ బ్యాన‌ర్‌కు. తెలుగు రాష్ట్రాల‌ను ఊపేసినా జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి - చూడాల‌ని ఉంది - ఇంద్ర వంటి భారీ హిట్ సినిమాల‌ను అందించింది. మూడేళ్లుగా మాత్రం కాస్త వెనుక‌బ‌డిన‌ట్టే క‌నిపించింది. 2015లో ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాను నిర్మించారు ఆ బ్యాన‌ర్‌ పై. ఆ త‌రువాత ఏ సినిమా ఆ బ్యాన‌ర్ నుంచి విడుద‌ల కాలేదు. ఇప్పుడు 2018లో మ‌హాన‌టి విడుద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్ట‌డంతో మ‌ళ్లీ ఆ బ్యాన‌ర్ మెయిన్ స్ట్రీమ్ మీద‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లో భారీ చిత్రాలు నిర్మించ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

మ‌హేష్ బాబు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే సినిమాను వైజ‌యంతీ మూవీస్ ప్రొడ్యూస్ చేయ‌నుంది. ఆ త‌రువాత జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించ‌నుంది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌ తో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్‌. ఆ సినిమా త‌రువాత వైజ‌యంతీ మూవీస్ సినిమా ఉంటుంది. సైరా త‌రువాత చిరుతో మూవీ మొద‌లుపెట్ట‌బోతోంది. ఆ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ వంతు. ఒక‌వేళ్ల చెర్రీ ఎన్టీఆర్ రాజ‌మౌళి సినిమాలో బిజీ అయిపోతే... మొద‌ట చిరు సినిమానే విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాల‌న్నీ 2019 -20ల‌లో విడుద‌ల అయ్యేట్టు ప్లాన్ చేస్తున్నారు అశ్వ‌నీద‌త్ టీమ్‌. ఏదేమైనా కూడా ది రిటర్న్ ఆఫ్‌ రియల్ బిగ్ ప్రొడ్యూసర్ అంటూ జనాలు ఆల్రెడీ కితాబులు ఇస్తున్నారు.