Begin typing your search above and press return to search.

ఫిక్స్‌: చెర్రీ సినిమాలో అత‌నే!

By:  Tupaki Desk   |   30 Nov 2015 5:26 AM GMT
ఫిక్స్‌:  చెర్రీ సినిమాలో అత‌నే!
X
చ‌ర‌ణ్ కొత్త సినిమాలోని ఒక పాత్ర గురించి టాలీవుడ్‌ లో చాలా రోజులుగా చ‌ర్చ న‌డుస్తోంది. నాగార్జున లాంటి స్టార్ క‌థానాయ‌కుడు మొద‌లుకొని బోలెడుమందిని ఆ పాత్ర కోసం ప‌రిశీలించారు. వాళ్ల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. కానీ చివ‌రికి ఆ పాత్ర‌కి అర‌వింద్ స్వామిని ఎంపిక చేశారు. త‌మిళంలో ఆయ‌నే చేసిన పాత్ర అది. అర‌వింద్ స్వామి త‌ప్ప మ‌రొక‌రు న్యాయం చేయ‌లేరేమో అన్నంత ఎఫెక్టివ్‌ గా ఉన్న ఆ పాత్రని మ‌రొక‌రి చేతిలో పెట్టేందుకు సాహ‌సం చేయ‌లేక‌పోయిందేమో చిత్ర‌బృందం. అందుకే చుట్టూ తిరిగి మ‌రో ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌క మ‌ళ్లీ ఆయ‌న ద‌గ్గ‌రికే వ‌చ్చింది ఆ పాత్ర‌. అందుకు సంంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన త‌ని ఒరువ‌న్ సినిమాని రామ్‌ చ‌ర‌ణ్ రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఇందులో నెగిటివ్ షేడ్స్‌ తో కూడిన పాత్ర‌ని అర‌వింద్ స్వామి పోషించాడు. కీల‌క‌మైన ఆ పాత్ర‌ని రీప్లేస్ చేసే న‌టుల కోసం తెలుగులో పెద్ద‌యెత్తున అన్వేషించారు. ఒక ద‌శ‌లో ఆ పాత్ర‌ని నాగార్జున‌తో చేయించాల‌నుకొన్నారు. అందుకు నాగ్ కూడా ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే చివ‌రి నిమిషంలో ఆ పాత్ర‌ని అర‌వింద్ స్వామితో చేయించాల‌ని చిత్ర‌బృందం నిర్ణయించుకుంది. అందుకోసం అర‌వింద్ స్వామికి భారీగా పారితోషికం ముట్ట‌జెబుతున్నార‌ట‌. విశ్వ‌స‌నీయ స‌మాచరం మేర‌కు రూ: 5కోట్లు ఇస్తున్న‌ట్టు తెలిసింది. ఇందులో క‌థానాయిక‌గా కాజ‌ల్ న‌టించ‌బోతున్న‌ట్టు తెలిసింది. త‌మిళంలో ఈ సినిమాలో జ‌యం ర‌వి - న‌య‌న‌తార క‌లిసి న‌టించారు.