Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్

By:  Tupaki Desk   |   14 Oct 2019 8:11 AM GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్
X
ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అమీషా పటేల్ ఆ తర్వాత అవకాశాలు లేక చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. తెలుగులో కూడా ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ పక్కన చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సినిమాలలో సరైన అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆమెకు ఇప్పుడు ఆమెపై పెట్టిన కోర్టు కేసులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నిర్మాత అజయ్ కుమార్ ఆమె మీద మోసం, మరియు చెక్ బౌన్స్ కేసు పెట్టడంతో అమీషా పటేల్ ఇబ్బందుల్లో పడింది.

'దేశీ మ్యాజిక్' అనే సినిమా నిర్మించడానికి అమీషా పటేల్, ఆమె భాగస్వామి తన నుండి 2.5 కోట్లు అప్పుగా తీసుకున్నారని అజయ్ కుమార్ చెప్పారు. కానీ వాళ్ళు ఆ చిత్రం చేయలేదని, తన డబ్బులు తిరిగి అడిగితే అమీషా పటేల్ చెక్ ఇచ్చిందని, అయితే ఆ చెక్ బౌన్స్ అయ్యిందని ఆయన ఆరోపించారు. అమీషా పటేల్ ని మరలా తన డబ్బులు ఇవ్వాలని కోరగా ఆమె తన మనుషులతో బెదిరించిందని ఆయన వాపోయారు. దీంతో ఆయన రాంచి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఈ విషయంపై అమీషా పటేల్ ట్విట్టర్ లో స్పందించింది. నిర్మాత అజయ్ కుమార్ తనను అప్రతిష్ఠపాలు చేయడానికే ఈ కేసు పెట్టారని ఆమె ఆరోపించింది. ప్రజలలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి పేరు పొందాలని అజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆమె అంటుంది. దీనిపై నేను న్యాయ పోరాటం చేస్తానంటుంది. దీనిపై కొంతకాలం మౌనంగా ఉందామనుకున్నానని అయితే అభిమానుల ఆందోళన చూసి స్పందించానని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.