Begin typing your search above and press return to search.

కోహ్లీ-అనుష్కలది చీప్ పబ్లిసిటీ స్టంట్..

By:  Tupaki Desk   |   19 Jun 2018 9:12 AM GMT
కోహ్లీ-అనుష్కలది చీప్ పబ్లిసిటీ స్టంట్..
X
ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ కం కోహ్లీ భార్య అనుష్క శర్మ నటుడు అర్హాన్ సింగ్ ను తిట్టిపోసిన సంగతి తెలిసిందే.. రోడ్డుపై చెత్త వేశాడన్న కారణంతో అనుష్క రెచ్చిపోయి అర్హాన్ చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపి అర్హాన్ పరువు పోయేలా చేసింది. తాజాగా ఈ ఘటనపై అర్హాన్ సింగ్ తల్లి స్పందించింది. విరాట్ కోహ్లీ, అనుష్కల తీరును తప్పుపట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

‘కోహ్లీ-అనుష్కలు శుభ్రత పేరిట చీప్ పబ్లిసిటీని కోరుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారని.. వారి నుంచి తన కుమారుడికి ప్రాణహాని ఉందని’ అర్హాన్ తల్లి పోస్టులో ఆందోళన వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి ప్రైవసీని దెబ్బతీయడం ఏంటని.. వీడియో పోస్టు చేసే సమయంలో ముఖాన్ని బ్లర్ చేయాలని తెలీదా అంటూ మండిపడింది.

‘మైదానంలో, సినిమాల్లో వారు సెలబ్రెటీలు కావచ్చు.. కానీ రోడ్డుపైకి వస్తే సాధారణ ప్రజలతో సమానం. వారు గొంతెత్తే ముందు పర్యవసనంగా తలెత్తే ఎదుటి వారి పరిస్థితిని కూడా ఆలోచించాలి’ అంటూ అర్హాన్ తల్లి ఫైర్ అయ్యింది. తన కుమారుడి వీడియోను పోస్టు చేయడం ద్వారా అతన్ని ప్రమాదంలో పడేశారని ఆరోపించింది. అనుష్క - కోహ్లీ చర్యల వల్ల తన కుమారుడి గోప్యత హక్కుకు భంగం వాటిల్లిందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది.