Begin typing your search above and press return to search.

ప్రేక్షకులకు స్వీట్ లెటర్ రాసిన స్వీటీ

By:  Tupaki Desk   |   26 Nov 2015 3:23 PM GMT
ప్రేక్షకులకు స్వీట్ లెటర్ రాసిన స్వీటీ
X
ఓ ప్రమోషన్ అంటే ఎలా ఉండాలి ? ఈ క్వశ్చన్ కి ఇన్నాళ్లూ రాజమౌళి ఒక్కడే సమాధానం చెప్పగలడని అనుకున్నారంతా. కానీ సైజ్ జీరో టీం జక్కన్నకి మించి కొత్త ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే గోల్డ్ కాయిన్ ఆఫర్ పై విపరీతంగా ప్రచారం చేస్తున్న అనుష్క అండ్ కో.. ఇప్పుడు ప్రేక్షకులకు డైరెక్ట్ లెటర్ కూడా రాసేశారు.

ఇంతకీ ఆ లెటర్ ఏంటో తెలుసా ? "హాయ్.. అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నాను. నిజానికి కొంచెం బరువుగా ఉన్నాను. బాహుబలి షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఇంచా చాలా తగ్గాలి. తగ్గుతాననే కాన్ఫిడెన్స్ ఉంది" అంటూ స్వీట్ లెటర్ స్టార్ట్ చేసింది అనుష్క. "నేను చాలా విధాలుగా రిలేట్ అయిన కేరక్టర్ స్వీటీ. మీ అందరూ నా ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా" అంటూ క్లోజ్ చేసింది. చివర్లో మన అందంర ఈ రోజే సైజ్ జీరో సినిమా చూద్దాం రమ్మని కూడా ఆహ్వానించేసింది.

అనుష్క లాంటి ముద్దుగుమ్మ ఆడియన్స్ కి లెటర్ రాసి.. రండి సినిమా చూడండి అనడం ఇదే ఫస్ట్ టైం. సరిగ్గా రిలీజ్ రోజ్ డేట్ వేసి.. ఈ లెటర్ పోస్టర్స్ గా వేస్తున్నారు. మీ అనుష్క, స్వీటీ అంటూ.. ఆడియన్స్ ఎమోషనల్ గా కూడా కట్టేశారు. వినూత్న ఐడియాలతో ప్రేక్షకుల్లోకి వస్తున్న సైజ్ జీరోపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటికి తగ్గట్టుగానే రిలీజ్ చేస్తున్నారు కూడా. మొదటి రోజున కనీసం పది కోట్ల వసూళ్లు రాబట్టే ఛాన్సులున్నాయంటోంది టాలీవుడ్. ఇదే గనక జరిగితే.. టాలీవుడ్ లో మరో లేడీ అమితాబ్ శకం మొదలైనట్లే.