Begin typing your search above and press return to search.

2.0 కోసం మరో 100కోట్లా?

By:  Tupaki Desk   |   20 Jun 2018 6:12 AM GMT
2.0 కోసం మరో 100కోట్లా?
X
ఇండియన్ సినిమా హిస్టరీలో అతిపెద్ద సినిమాగా చెప్పుకుంటున్న 2.0 ఇంకా విడుదలకు నోచుకోకపోవడంతో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. షూటింగ్ పూర్తయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. గ్రాఫిక్స్ పనుల కోసం సినిమాకు సమయం ఎక్కువ పడుతుందని అందరికి తెలుసు. కానీ ఆర్నెళ్ళల్లో పూర్తి కావల్సిని పనులు ఇంకా వాయిదాలు పడుతూనే ఉంది. దర్శకుడు శంకర్ సినిమా కరెక్ట్ గా వచ్చే వరకు పట్టు వదలడం లేదు.

మరో వైపు ప్రొడక్షన్ సంస్థ లైక కు బయ్యర్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ వార్నింగ్ లు ఇస్తున్నారు. సినిమా రిలీజ్ చేయకుండా అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయండని మండిపడుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఇప్పటికే సినిమా కోసం 400 కోట్లను ఖర్చు పెట్టింది. ఇక ఇప్పుడు మరో 100 కోట్లు కుమ్మరించక తప్పడం లేదని తెలుస్తోంది. గ్రాఫిక్స్ పనులను చేయాల్సిన సంస్థ దివాళ తీసేయడంతో మరో కంపెనీని వెతుకున్నారు. దర్శకుడు శంకర్ ప్రస్తుతం గ్రాఫిక్స్ టీమ్ తో పనులను చేయిస్తున్నాడు.

ఈ బడ్జెట్ చూసి హాలీవుడ్ దర్శకులే 2.0 పై ఓ కన్నేసే వరకు వచ్చింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చుసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మరి శంకర్ ఇలానే ఆలస్యం చేస్తే ఆ సంఖ్య తగ్గిపోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అసలే 500 కోట్లు కుమ్మరించారు. ఎంత పెద్దగా రిలీజ్ చేసినా సినిమాలో కాస్త తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. మరి శంకర్ ప్లాన్ ఎలా ఉందొ చూడాలి!