Begin typing your search above and press return to search.

ఆ నిర్మాతతో మళ్లీ మహేష్!!

By:  Tupaki Desk   |   12 March 2018 7:29 AM GMT
ఆ నిర్మాతతో మళ్లీ మహేష్!!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ తో సినిమా చేయడం అనేది ఓ నిర్మాతకు అయినా ప్రెస్టీజియస్ విషయమే. తమ బ్యానర్ విలువను పెంపొందించేందుకునే ఈ చిత్రాలు ఉపయోగపతాయని భావిస్తారు నిర్మాతలు. అలాంటిది మహేష్ తో వరుసగా రెండు భారీ బడ్జెట్ చిత్రాలను ఒకే నిర్మాత తీయడం చిన్న విషయం కాదు. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆగడు మూవీని కూడా మహేష్ తో కూడా రూపొందించారు అనిల్ సుంకర.

ఆ తర్వాత చిన్న సినిమాల బాట పట్టిన ఆయన.. ప్రస్తుతం 14 రీల్స్ ఎంటర్టెయిన్మెంట్ అధినేతల్లో ఒకరైన అనిల్ సుంకర.. తన ఏకె ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్ పై నిఖిల్ హీరోగా కిర్రాక్ పార్టీ చిత్రాన్ని విడుదలకు రెడీ చేసేశారు. మార్చ్ 16న విడుదల కానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు అనిల్. భవిష్యత్తులో మహేష్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఫైనల్ అయిన తర్వాత.. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తామని కూడా అన్నారు.

కిర్రాక్ పార్టీ నిఖిల్ కి సరిగ్గా సరిపోయే సబ్దెక్ట్ అంటున్న అనిల్ సుంకర.. తేజ- వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందనున్న ఆట నాదే - వేట నాదే మూవీని ఈ నెల 26న అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. టైగర్ నాగేశ్వరరావు అనే పేరుతో ఓ బయోపిక్ ను కూడా తెరకెక్కించనున్నామని.. ఇందులో రానా హీరోగా నటిస్తాడని చెప్పిన ఆయన.. బాలకృష్ణ.. శర్వానంద్.. రాజ్ తరుణ్.. అల్లరి నరేష్ లతో సినిమాలు చర్చల దశలో ఉన్నాయన్నారు. అయితే వీటిలో ఎన్ని సొంత బ్యానర్లో ఎన్ని 14 రీల్స్ బ్యానర్లో తీస్తారో మాత్రం చెప్పలేదు.