Begin typing your search above and press return to search.

ఆంధ్రా బేబీ ఆంటీ పాటకు రహమాన్ సాహో!

By:  Tupaki Desk   |   15 Nov 2018 12:29 PM GMT
ఆంధ్రా బేబీ ఆంటీ పాటకు రహమాన్ సాహో!
X
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది, దాన్ని గుర్తించి వెలికి తీస్తే తప్పకుండా జీవితంలో విజయాన్ని అందుకోవచ్చు అనేది ఒక సినిమా డైలాగ్‌. అయితే ఎంతో మంది తమలో ఉన్న ప్రతిభను గుర్తించుకోలేక పోవడం లేదు, వారిలో ఉన్న ప్రతిభకు ప్రోత్సాహం లేకపోవడంతో తమ ప్రతిభను మరుగున పడేస్తారు. ఇన్నాళ్లు తన ప్రతిభను గుర్తించుకోలేదో లేక ప్రతిభకు ప్రోత్సాహం దక్కలేదో కాని ఆంధ్రాకు చెందిన బేబీ ఆంటీ లేట్‌ వయస్సులో గుర్తింపు దక్కించుకున్నారు. తన అద్బుతమైన గానంతో ఏకంగా ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రహమాన్‌ కూడా ఫిదా అయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రా ప్రాంతంకు చెందిన బేబీ అనే నడి వయసు ఉన్న మహిళ ‘ప్రేమికుడు’ సినిమాలోని ఓ చెలియా నా ప్రియ సఖియా.. అనే పాటను పాడినది. ఆ పాట చాలా క్యాజువల్‌ గా, సరదాగా కొందరు కోరితే పాడటం జరిగింది. ఎవరో ఆ పాటను వీడియో షూట్‌ చేసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆమె గాత్రంకు ఫిదా అయిన వారు ఎంతో మంది అద్బుతమైన గానం అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమె వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆమె వివరాలను తెలుసుకుని రఘు కుంచె స్వయంగా ఆమెతో ఫోన్‌ లో కూడా మాట్లాడటం జరిగింది.

తాజాగా ఏఆర్‌ రహమాన్‌ ఆమె వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌ లో పోస్ట్‌ చేయడంతో ఆమె మరింతగా సెలబ్రెటీ అయ్యింది. ఎంతో మంది సంగీత దర్శకులు మరియు ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ఆమె పాటను అభినందిస్తున్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ లేకుండా కూడా ఆ పాటను అంత చక్కగా - వినసొంపుగా పాడిన బేబి గారిని అభినందించకుండా ఉండలేక పోతున్నారు. ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ సింగర్‌ గా ఆమె మారిపోయింది. రఘు కుంచె ఇప్పటికే ఆమెతో తన తర్వాత సినిమాలో పాడివ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. ముందు ముందు మరిన్ని పాటలు పాడే ఛాన్స్‌ ఆమెకు రావచ్చు. సోషల్‌ మీడియాతో ఆమెలోని ప్రతిభకు గుర్తింపు దక్కింది.