Begin typing your search above and press return to search.

రంగమ్మత్త అప్సెట్.. కౌంటర్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   18 Feb 2019 7:41 AM GMT
రంగమ్మత్త అప్సెట్.. కౌంటర్ ఇచ్చింది
X
ఫిబ్రవరి 14 జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవానులపై జరిగిన తీవ్రవాద దాడిలో 49 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది. చాలామంది నెటిజనులు ఈ దాడికి గట్టిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది మరీ ముందుకెళ్ళి పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే పుల్వామా దాడిపై స్పందించిన సెలబ్రిటీలలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు.

దాడి జరిగిన రోజు తన స్పందన తెలపడమే కాకుండా ఇప్పటివరకూ ఈ అంశంపై తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చాలా పోస్టులే పెట్టింది అనసూయ. వీటితో పాటుగా రెగ్యులర్ గా పోస్ట్ చేసే ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. దీంతో కొందరు నెటిజనులు ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఒకవైపు పుల్వామా దాడి విషయంలో అందరూ బాధపడుతుంటే నువ్వు ఇలా రెడీ అయ్యి ఫోటోలు పోస్ట్ చేస్తావా అంటూ విమర్శలు చేశారు. దీనికి అనసూయ ఘాటు సమాధానమే ఇచ్చింది.

"ఆ సంఘటన తర్వాత మీరు స్నానం చేయడం మానేశారా.. అన్నం తినడం మానేశారా? మరి నా డ్రస్ కు ఆ ఇన్సిడెంట్ కు సంబంధం ఏంటి? ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా డ్యూటీ.. నా డ్యూటి నేను చేయడంలో తప్పేముంది.. మీరు కూడా మీ పని చూసుకోండి" అంటూ రిప్లై ఇచ్చింది.