Begin typing your search above and press return to search.

సెలబ్రిటీల కొత్త క్రేజ్ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   20 Aug 2017 9:49 AM GMT
సెలబ్రిటీల కొత్త క్రేజ్ ఏంటో తెలుసా?
X
మన తెలుగు సినిమా ఇండస్ర్టీలో సీజన్ కో కొత్త క్రేజ్ వస్తుంది. సంవత్సరానికి ఓ కొత్త ట్రెండ్ వస్తుంది. అలాంటి వాటిలో అమ్మాయిలు షార్ట్ హెయిర్ పెంచుకోవడం నుండి అబ్బాయిలు నో షేవ్ నవంబర్ అనడం వరకు.. అందరూ రేంజ్ రోవర్ కార్ల నుండి ఐఫోన్7 వాడటం వరకు.. ఇలాంటి చాలా కోరికలను క్రేజ్ గా మార్చుకుని ఫాలో అయిపోతుంటారు. మరి ఈ వానాకాలంలో హైదరాబాద్ లో ఉండే సెలబ్రిటీలకు ఇష్టమైనదేంటో తెలుసా?

ఇప్పుడు అర్ధరాత్రి అయ్యిందంటే చాలు.. మనోళ్ళ ఖైరతాబాద్ వెళిపోతున్నారు. రంజాన్ సీజన్లో ముసుగులు వేసుకుని మరి మంచు లక్ష్మి.. తాప్సీ వంటి హాటీలు ఓల్డ్ సిటీ వెళ్ళి హలీమ్ తిని ఛార్మినార్ ను చూసుకుని వస్తే.. ఇప్పుడు వినాయకచవితి సీజన్ రాగానే ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి అర్ధరాత్రులు బయలుదేరుతుంటారు. ఆల్రెడీ యాంకర్ అనసూయ అర్ధరాత్రి వెళిపోయి దర్శించుకుని ఒక సెల్ఫీ కూడా పెట్టేసింది. అదిగో ఆ ఫోటోను చూసి ఇప్పుడు మిగిలిన వారు కూడా బయలుదేరుతున్నారు.

అసలు హైదరాబాద్ లో గణేష్‌ ఫెస్టివల్ అంటేనే ఆ కిక్కే వేరు. ఈ చుట్టు ప్రక్కల చాలా ఏరియాల్లో పోటీలు పడి మరీ వినాయకుడి విగ్రహాలు పెట్టడం దగ్గరనుండి.. బాలాపూర్ వంటి లడ్డూను వేలం వేయడం వరకు.. అలాగే వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమర్జనం చేయడం నుండి సెలబ్రిటీలు అవన్నీ వీక్షించడానికి క్యూలు కట్టడం.. జనాలు కూడా పోటెత్తడం.. టివిల్లో లైవులు.. స్కూళ్ళకు సెలవులు.. అబ్బో ఆ కిక్కే బేరబ్బా. ప్రతీ సంవత్సరం ఆ క్రేజే చాలా కొత్తగా ఉంటుందబ్బా!!