Begin typing your search above and press return to search.

తెల్ల‌గా ఉంటావా అంటూ మ‌ట్టిపూసేశార‌ట‌

By:  Tupaki Desk   |   15 April 2018 5:59 AM GMT
తెల్ల‌గా ఉంటావా అంటూ మ‌ట్టిపూసేశార‌ట‌
X
అన‌సూయ కాస్తా రంగ‌మ్మ‌త్త‌గా మారింది. ఈ ఒక్క సినిమాతో అన‌సూయ‌ ఇమేజ్ మొత్తం మారిపోవ‌ట‌మే కాదు.. ఆమె న‌ట‌నను ఇప్పుడు అంద‌రూ తెగ పొగిడేస్తున్న ప‌రిస్థితి. వాస్త‌వానికి ఇప్ప‌టివ‌ర‌కూ టీవీ తెర మీదా.. సిల్వ‌ర్ స్క్రీన్ మీద క‌నిపించిన అన‌సూయ‌కు.. రంగ‌స్థ‌లంలో కనిపించిన రంగ‌మ్మ‌త్త‌కు సంబంధం లేద‌నే చెప్పాలి.

త‌న‌కొచ్చిన స‌రికొత్త ఇమేజ్ తో మాంచి హుషారుగా ఉంది అన‌సూయ‌. ఎప్పుడూ లేనిది ఆమె ఇంట‌ర్వ్యూలు పేజీల‌కు పేజీలు వేసేస్తున్న ప‌రిస్థితి. తాజాగా ఇచ్చిన ఒక ప్ర‌త్యేక ఇంటర్వ్యూలో రంగ‌స్థ‌లం షూటింగ్ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఒక స‌ర‌దా సంఘ‌ట‌న గురించి చెప్పుకొచ్చారు అన‌సూయ‌.

రంగ‌స్థ‌లంలో త‌న‌ను రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్ చేయ‌మ‌ని అడిగిన‌ప్పుడు.. రామ్ చ‌ర‌ణ్.. స‌మంత‌.. ఆది.. జగ‌ప‌తిబాబు .. ప్ర‌కాష్ రాజ్ లాంటి వారి పేర్లు విన్న‌ప్పుడు.. అలాంటి వారితోక‌లిసి.. రంగ‌మ్మ‌త్త లాంటి పాత్ర చేయ‌ట‌మా అని తెగ టెన్ష‌న్ ప‌డిపోయిన‌ట్లు చెప్పారు. చాలా టెన్ష‌న్ గా ఉండేద‌ని.. షూటింగ్ కోసం రాజ‌మండ్రి స‌మీపంలోని శివ‌గిరికి తాను కాస్త ఆల‌స్యంగా వెళ్లిన‌ట్లు చెప్పారు.

షూటింగ్ స్టార్ట్ అయిన ప‌ది రోజుల‌కు తాను వెళ్లేస‌రికి.. రామ్ చ‌ర‌ణ్.. స‌మంత‌.. ఇలా అంద‌రూ తందూరీల్లా కందిపోయి న‌ల్ల‌గా మారిపోయార‌న్నారు. తాను రంగ‌మ్మ‌త్త గెట‌ప్ వేసుకొని వెళ్లేస‌రికి.. అది.. రామ్ చ‌ర‌ణ్ లు.. నువ్వు ఇంత నీట్ గా తెల్ల‌గా ఉంటే మాలో క‌ల‌వ‌టం లేదంటూ చేతుల‌కు మ‌ట్టి పూసేశార‌న్నారు. షూటింగ్ లో చిత్ర బృంద‌మంతా ఫ్రెండ్లీగా ఉండ‌టంతో టెన్ష‌న్ త‌గ్గిపోయింద‌న్నారు. జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ లోని ఇద్ద‌రు ముగ్గురు రంగ‌స్థ‌లంలో న‌టించ‌టంతో తామంతా కూర్చొని జోకులు వేసుకునే వాళ్ల‌మ‌న్నారు. షూటింగ్ అప్పుడు అత్త అని పిల‌వొద్ద‌ని గొడ‌వ చేశాన‌ని.. కానీ ఇప్పుడు ఆ పిలుపే న‌చ్చుతోంద‌ని చెప్పారు.