Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంగా ప్ర‌ముఖ న‌టుడి మాజీ అల్లుడి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   19 May 2017 5:57 AM GMT
సంచ‌ల‌నంగా ప్ర‌ముఖ న‌టుడి మాజీ అల్లుడి ఫిర్యాదు
X
ప్ర‌ముఖ సినీ న‌టుడు విజ‌య్ కుమార్ మాజీ అల్లుడు చెబుతున్న మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. త‌న‌కు జ‌రిగిన అన్యాయం మీద ఆయ‌న హైద‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం మీద కేసు క‌ట్టిన పోలీసులు.. విచార‌ణ‌లో భాగంగా ప్ర‌త్యేక పోలీసు బృందాల్ని చెన్నై.. కోయంబ‌త్తూరుల‌కు పంపారు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగింద‌న్న‌ది చూస్తూ.. ప్ర‌ముఖ న‌టులు విజ‌య్ కుమార్‌.. మంజుల దంప‌తుల కుమార్తె వ‌నిత‌.

ఆమెను త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన ఆనంద్ రాజ‌న్ తో 2007లో వివాహం జ‌రిపారు. వీరికి ఎనిమిదేళ్ల జైనిక అనే కుమార్తె ఉంది. పెళ్లి జ‌రిగిన ఐదేళ్ల‌కు దంప‌తుల మ‌ధ్య విభేదాలు రావ‌టంతో ఇరువురు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

దీంతో.. కుమార్తె ఎవ‌రి ద‌గ్గ‌ర ఉండాల‌న్న విష‌యం కోర్టు ముందుకు వెళ్లింది. తండ్రి ద‌గ్గ‌రే జైనిక‌ను ఉంచాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆనంద‌రాజ‌న్ హైద‌రాబాద్ లోని అల్వాల్ లో ఉంటున్నారు. కొంత‌కాలంగా త‌ర‌చూ ఆనంద‌రాజ‌న్ ఇంటికి వ‌చ్చి పాప‌ను చూసుకుంటూ వ‌చ్చి వెళ్లేది.

కొద్ది కాలం కింద‌ట వ‌నిత‌కు వేరే వ్య‌క్తితో వివాహ‌మైంది. త‌ర్వాత పాప‌ను చూడ‌టానికి రాలేదు. అయితే.. గ‌త నెల 18న ఆనంద్ రాజ‌న్ ఇంటికి వ‌చ్చిన వ‌నిత‌.. త‌న‌తో పాప‌ను తీసుకెళ్లింది. మ‌ళ్లీ తిరిగి రాలేదు. ఎంత వెతికినా వ‌నిత ఆచూకీ తెలియ‌లేదు. దీంతో.. ఆనంద‌రాజ‌న్ వ‌నిత మీద పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కిడ్నాప్‌.. చీటింగ్ కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాప ఆచూకీ కోసం ప్ర‌త్యేక పోలీసు బృందాలు త‌మిళ‌నాడుకు పంపిన‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/