Begin typing your search above and press return to search.

పివోట్ టాక్: ముగ్గురు మాస్ రాజాలా

By:  Tupaki Desk   |   24 Sep 2018 6:37 AM GMT
పివోట్ టాక్: ముగ్గురు మాస్ రాజాలా
X
మాస్ మహారాజా రవితేజ దర్శకుడు శీను వైట్ల కాంబోలో రూపొందుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ మినీ టీజర్ ను పివోట్ పేరుతో మైత్రి సంస్థ విడుదల చేసింది. దీని తాలూకు అప్ డేట్ నిన్నే ప్రకటించారు కాబట్టి తమ హీరో ఎలా ఉంటాడా అనే ఉత్సుకత అభిమానుల్లో ఉంది. ఇక టీజర్ విషయానికి వస్తే నిమిషం లోపే ఉన్న ఈ వీడియోలో రవితేజను మూడు సార్లు వేర్వేరు గెటప్స్ లో చూపించారు. మూడు వేరియేషన్స్ సీరియస్ గా ఉండటం గమనార్హం. ఆలోచిస్తూ- వెతుకుతూ-మధనపడుతూ ఇలా మూడు విభిన్న భావాలతో రవితేజను ఇందులో చూపించారు. కాని అన్ని గెటప్స్ ఒకేలా ఉండటం చూస్తుంటే అమర్ అక్బర్ ఆంటోనీలు ఒక్కరా లేక ముగ్గురా అనే సస్పెన్సు మాత్రం ఓపెన్ చేయలేదు. దానికి తోడు టీజర్ మొదట్లో గుడ్లగూబను చూపించడం కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. రవితేజను తప్ప హీరోయిన్ తో సహా ఇంకెవరిని ఇందులో రివీల్ చేయలేదు.

ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన టార్గెట్ తో దర్శకుడు శీను వైట్ల దీన్ని రూపొందిస్తున్నాడు. గత మూడు సినిమాల చేదు ఫలితాలనుంచి బయటపడేలా పక్కా స్క్రిప్ట్ తో రవితేజను మెప్పించాడనే టాక్ అయితే ఉంది. ఈ ఇద్దరి కాంబోలో ఫెయిల్యూర్ లేదు. నీ కోసం-వెంకీ-దుబాయ్ శీను మూడు హ్యాట్రిక్ హిట్స్ అయ్యాయి. ఇది నాలుగోది. సో తనకు ప్లాప్ ఇవ్వని దర్శకుడిగా ప్లస్ హీరోగా మొదటి బ్రేక్ ఇచ్చిన మిత్రుడిగా శీను వైట్ల మీద చాలా సాఫ్ట్ కార్నర్ తో రవితేజ ఈ ఛాన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. కాకపోతే శీను ట్రాక్ రికార్డు హీరోయిన్ ఇలియానా చాలా కాలం క్రితమే తెరమరుగు కావడం లాంటి కారణాలు కొంత ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పివోట్ లో చాలా ప్రత్యేకంగా చెప్పుకునే వైవిధ్యం ఏది లేకపోవడం కూడా కొంత మైనస్ గా మారే అవకాశం ఉంది. సో రవితేజ-శీను వైట్ల-ఇలియానా ఈ ముగ్గురికి అవసరమైన హిట్ ని అమర్ అక్బర్ ఆంటోనీలు ఇస్తారో లేదో వేచి చూడాలి. విడుదల తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.