Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్ చెయ్యాల్సిన మూవీనా??

By:  Tupaki Desk   |   28 April 2016 5:30 PM GMT
పవన్ ఫ్యాన్ చెయ్యాల్సిన మూవీనా??
X
వరుస ఫ్లాపుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామ జపం స్టార్ట్ చేయగానే.. నితిన్ రేంజ్ మారిపోయింది. అంతకుముందు కూడా పవన్ కి నితిన్ వీరాభిమాని అయినా.. ఓపెన్ గా చెప్పిన తర్వాత దశ తిరిగిపోయింది. అయితే.. నితిన్ చేయాల్సిన ఓ ప్రాజెక్ట్.. ఇప్పుడు అల్లు శిరీష్ చేతికి వెళ్లిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

కొంత కాలం క్రితం కొత్త డైరెక్టర్ మల్లిడి శ్రీను దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమాని అనౌన్స్ చేశారు. దీనికి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. కానీ అంతలోనే నితిన్ కి త్రివిక్రమ్ నుంచి పిలుపు వచ్చింది. చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసి సమంతతో కలిసి అ..ఆ.. ని స్టార్ట్ చేసేశాడు నితిన్. ఇప్పుడు ఆ మల్లిడి శ్రీనునే.. పేరు మార్చుకుని ఎంవీఎన్ రెడ్డిగా అల్లు శిరీష్ హీరోగా సినిమా మొదలుపెట్టాడు. ఇప్పుడు అల్లు వారబ్బాయి సినిమాకి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.

మరి.. ఇప్పుడు శిరీష్ తో స్టార్ట్ చేసిన మూవీ, నితిన్ కి చెప్పిన కథ ఒక్కటేనా అన్నదే అసలు క్వశ్చన్. దీనిపై ఆన్సర్ ఇవ్వకపోయినా.. ఎంవీఎన్ రెడ్డి సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట ఆసక్తికరంగా ఉంది. 'ఒక సినిమాను ఒప్పుకోవడానికి నితిన్ సంవత్సరాల సమయం తీసుకోగా.. అల్లు అరవింద్, శిరీష్ లు సింగిల్ సిట్టింగ్ లో ఓకే చెప్పేశారు. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది' అన్నది డైరెక్టర్ వెర్షన్. మరి క్లారిటీ కావాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే.