Begin typing your search above and press return to search.

తండ్రితో కలసి హిట్టు.. ఆ కిక్కే వేరు

By:  Tupaki Desk   |   5 May 2016 4:12 AM GMT
తండ్రితో కలసి హిట్టు.. ఆ కిక్కే వేరు
X
''ఓ సినిమా కోసం.. 100 రూపాయలు అనుకుంటే.. 100 రూపాయల మీద మ్యాగ్జిమం మా నాన్న ఓ 10 రూపాయలు వేసి.. 110 ఖర్చుపెడతాడు. కాని ఈసారి మాత్రం 100 మీద ఏకంగా 50 పెట్టి.. 150 ఖర్చుపెట్టాడు. ఎందుకు ఇలా పెడుతున్నావ్‌ అంటే.. ఉరేయ్‌ 150 పెడితే నాకు 300 తిరిగొస్తుంది అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతోంది'' అంటున్నాడు స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

విజయవాడలో గత రాత్రి జరిగిన ''సరైనోడు'' సక్సెస్‌ మీట్‌ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేశాడు బన్నీ. అసలు తన తండ్రి గురించి ఒక కొడుకుగా కాకుండా.. ఈ సినిమా హీరోగా నాలుగు మాటలు చెప్పాలంటూ పై విధంగా చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్‌ కు ఈ ప్రాజెక్టు మీద ముందు నుండి బాగా కాన్ఫిడెన్సు ఉన్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని బన్నీ మళ్ళీ చెప్పాడు. పైగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినందుకు ఇంకా ఆనందంగా ఉందట. ''నా కెరియర్‌ లో ఇప్పటివరకు చాలా హిట్లు ఉన్నాయ్‌. కాని తండ్రితో కలసి ఒక హిట్టు కొడితే దాని లెక్కే వేరు. ఇద్దరం కలసి బాగా సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నాం. ఇలాంటి హిట్టిచ్చిన బోయపాటి శ్రీను గారికి కృతజ్ఞతలు'' అన్నాడు బన్నీ.

ఈ సందర్భంగా ఇంకా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలు చూసి పెరిగిన తనకు.. మాస్‌ సినిమాలు అంటే చాలా ఇష్టమని.. కేవలం ఇంద్ర సినిమాను మాత్రమే 17 సార్లు చూశానని.. మాస్‌ సినిమా పవర్‌ అది.. అంటూ చెబుతూ.. విజయవాడ ఆడియన్స్‌ ను ఉర్రూతలూగించాడు. పైగా చిరంజీవి ఇంద్ర 100 డేస్‌ ఫంక్షన్‌ లో విజయవాడలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. వారిని ఇంకా ఖుషీ చేశాడు.