Begin typing your search above and press return to search.

​కొడుకుల కోసం అల్లు వారి పన్నాగం

By:  Tupaki Desk   |   24 Jun 2017 5:19 AM GMT
​కొడుకుల కోసం అల్లు వారి పన్నాగం
X
మన దేశంలో సినిమా మూడు వీటిపైన నడుస్తుంది ఎంటర్టైన్మెంట్ - ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని విధ్యబాలన్ దర్టీ పిక్చర్లో చెప్పినట్లు నిజంగానే సినిమా వినోదం కోసమే చూస్తారు మనవాళ్లు. కాకపోతే ఈ వినోదం ఎవరు చేస్తారు రాసేవాడు చేస్తాడా తీసేవాడు చేస్తాడా లేకపోతే చేసేవాడు చేస్తాడా అనేది ఒక ప్రశ్న. ఎవరు ఎన్ని చెప్పిన తీసేవాడే సినిమాకు కర్మ కర్త క్రియ కాబట్టి నిర్మాతలు అందరూ ఇప్పుడు స్టార్స్ ను తరవాత ఎంచుకుందాం ముందు తీసేవాడిని పట్టుకుందాం అని వేటాడుతున్నారు.

తెలుగు నిర్మాతలలో తెలివైన నిర్మాతగా పేరు తెచ్చుకున్న అల్లు అరవింద్ ఇప్పుడే తన కొడుకుల కోసం ఒక డైరెక్టర్ని అలాగే ఎర వేసి పట్టాడు. ‘టైగర్’ - ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా డైరెక్టర్ వి ఐ ఆనంద్ ఇప్పుడు అల్లు శిరీష్ తో ఒక సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పైగా పూర్తి అయింది. అల్లు అరవింద్ ఆ షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను చూసి వెంటనే తన తరవాత సినిమాకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. అల్లు అర్జున్ తో ఒక సినిమా తప్పకుండా నీవు చేయాలి అని చెప్పాడట అరవింద్. కొడుకులు కెరియర్ గురించి బాగానే పన్నాగాలు వేస్తున్నాడు తండ్రి. ఇప్పుడు వస్తున్న సినిమాలలో చేస్తున్న స్టార్ కన్నా జరిగే కథ తీసే కథకుడుకు అవసరం బాగానే ఉంది. అందుకే అల్లు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనమాట.

అల్లు శిరీష్ హీరోగా సురభి - సీరత్ కపూర్ హిరోయిన్లు గా నటిస్తున్న సినిమా ఇప్పుడు ఆనంద్ డైరక్షన్లో షూటింగ్ నడుస్తుంది. ఈ సినిమాకు సంగీతం మణి శర్మ అందిస్తున్నారు. అయితే మరి ఈ సినిమా పూర్తి చేసి అల్లు అర్జున్ తో ఎప్పుడు సినిమా మొదలు అవుతుందో తెలియవలిసి ఉంది.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/