Begin typing your search above and press return to search.

'2.ఓ' : తుఫాన్‌ హెచ్చరిక చేసిన అక్షయ్‌

By:  Tupaki Desk   |   15 Nov 2018 7:56 AM GMT
2.ఓ : తుఫాన్‌ హెచ్చరిక చేసిన అక్షయ్‌
X
గత మూడు సంవత్సరాలుగా సౌత్‌ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండియన్‌ సినీ ప్రేక్షకులు మరియు ఫిల్మ్‌ మేకర్స్‌ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘2.ఓ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రజినీకాంత్‌ - అక్షయ్‌ కుమార్‌ - శంకర్‌ ల కలయికలో తెరకెక్కిన ఈ అద్బుతమైన విజువల్‌ వండర్‌ మూవీని ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపుగా 600 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం హాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ట్రైలర్‌ చూస్తేనే అర్థం అవుతుంది.

‘రోబో’ చిత్రానికి ఇది సీక్వెల్‌ కనుక రజినీకాంత్‌ పాత్ర గురించి ప్రేక్షకులకు క్లారిటీ ఉంది. కాని అక్షయ్‌ కుమార్‌ పాత్ర ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. అక్షయ్‌ కుమార్‌ పాత్ర గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దుష్టశక్తిగా అక్షయ్‌ కుమార్‌ కనిపిస్తాడని తెలుస్తోంది. సినిమా టీజర్‌ విడుదలైనప్పటి నుండి కూడా అక్షయ్‌ కుమార్‌ శరీరం అంతా కూడా మొబైల్స్‌ తో కూడి ఉంది. తాజాగా ట్రైలర్‌ లో అది ఇంకా క్లారిటీ ఇచ్చారు.

అక్షయ్‌ కుమార్‌ పాత్రకు - మొబైల్స్‌ కు సంబంధం ఏంటా అంటూ అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అక్షయ్‌ మరో భయంకరమైన పోస్టర్‌ ను విడుదల చేశాడు. మొబైల్స్‌ తో కూడిన రెక్కలను కలిగి ఉండి - అతి భారీ కాయుడిగా అక్షయ్‌ కుమార్‌ ఆ పోస్టర్‌ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్‌ తో పాటు తుఫాన్‌ వచ్చేస్తోంది అంటూ ట్వీట్‌ చేశాడు. నవంబర్‌ 29న తుఫాన్‌ రాబోతుంది, మీరు సిద్దమేనా అంటూ అక్షయ్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘2.ఓ’ చిత్రంలో రజినీకాంత్‌ కంటే కూడా అధికంగా అక్షయ్‌ కుమార్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. దాంతో బాలీవుడ్‌ లో ఈ చిత్రం రికార్డు స్థాయి బిజినెస్‌ చేసిందట. ఇప్పటి వరకు ఉన్న ఇండియన్‌ సినిమాస్‌ రికార్డులన్నీ కూడా చిట్టి రోబో మరియు మొబైల్‌ రాక్షసుడు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.