Begin typing your search above and press return to search.

అఖిల్ మూడేళ్ళ క్రితమే కమిటయ్యాడట

By:  Tupaki Desk   |   20 Jan 2019 7:05 AM GMT
అఖిల్ మూడేళ్ళ క్రితమే కమిటయ్యాడట
X
గత కొంత కాలంగా నాగ్ తో సహా ఫ్యామిలీ హీరోల ట్రాక్ రికార్డు ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో అక్కినేని అభిమానుల ఆశలన్నీ మిస్టర్ మజ్ను మీదే ఉన్నాయి. ఈ నెల 25న విడుదలవుతున్న నేపధ్యంలో నిన్న గ్రాండ్ గా జరిపిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి హైప్ పెంచే ప్రయత్నం గట్టిగా చేసారు. అయితే అఖిల్ స్పీచ్ లో భాగంగా చెప్పిన మాటలు కొత్త అనుమానాలు రేకెత్తించాయి. మిస్టర్ మజ్ను దర్శకుడు వెంకీ అట్లూరితో అఖిల్ కు ఎప్పటి నుంచో పరిచయముందట. మూడేళ్ళ క్రితమే ఈ కథ చెప్పినా డెబ్యుకు సెట్ కాదనే ఉద్దేశంతో ఇది పెండింగ్ లో పెట్టినట్టుగా చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత వెంకీ వరుణ్ తేజ్ తో చేసిన తొలిప్రేమ సక్సెస్ కావడంతో ఈ కథ చేయడానికి ఇదే రైట్ టైం అని భావించడం వల్ల ఇది తెరపైకి వచ్చిందని సెలవిచ్చాడు. అయితే నిజానికి మీడియా సర్కిల్స్ తో పాటు ఫిలిం నగర్లో ఇప్పటి దాకా వినిపించిన వెర్షన్ వేరు. మొదటి రెండు సినిమాలు డిజాస్టర్లు కావడంతో మూడోది ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న టార్గెట్ తో నాగ్ ఏరికోరి మరీ వెంకీని తీసుకొచ్చినట్టుగా చెప్పుకున్నారు. ఒకవేళ అఖిల్ వెర్షన్ నిజమే అయితే హలో ఫలితం తేలిన రెండు మూడు నెలలకే ఇది ఓకే చేసి ఉండవచ్చు.

పోనీ వెంకీ అట్లూరి వరుణ్ కు కమిట్ అయ్యాడు అనుకుందాం. మరి తొలిప్రేమ రిలీజ్ తర్వాత అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్టు. ఫిబ్రవరిలో విడుదలయ్యాక మూడు నెలల తర్వాత కాని మొదలుపెట్టలేదు. సో మూడేళ్ళ క్రితమే స్టొరీ వెంకీ సిద్ధం చేసి పెట్టాడు అనే పాయింట్ లో చిన్న లాజిక్ మిస్ అవుతోంది. ఇదలా ఉంచితే ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాల్సిన టార్గెట్ తో మిస్టర్ మజ్నుతో రంగంలోకి దిగుతున్నాడు అఖిల్. 25న పోటీ పెద్దగా లేదు కాబట్టి ఆ అవకాశాన్ని ఎంత వరకు సద్వినియోగపరచుకుంటాడో వేచి చూడాలి