Begin typing your search above and press return to search.

పీకే ఫ్యాన్స్ కు శ్రీ‌రెడ్డి వార్నింగ్!

By:  Tupaki Desk   |   19 April 2018 11:31 AM GMT
పీకే ఫ్యాన్స్ కు శ్రీ‌రెడ్డి వార్నింగ్!
X
ప‌వ‌న్ క‌ల్యాణ్ ను శ్రీ‌రెడ్డి అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించ‌డం టాలీవుడ్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల‌లో తీవ్ర క‌ల‌కం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాను వ‌ర్మ స‌ల‌హా ప్ర‌కార‌మే అలా తిట్టాన‌ని - ప‌వ‌న్ కు ఆయ‌న త‌ల్లికి బ‌హిరంగా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని శ్రీ‌రెడ్డి ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వ్య‌వ‌హారానికి క‌ర్త క‌ర్మ క్రియ అని చెప్పిన వ‌ర్మ కూడా పీకేకు ఆయ‌న అభిమానుల‌కు సారీ చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ, శ్రీ‌రెడ్డిపై పీక‌ల‌దాకా కోపంతో ఉన్న పీకే ఫ్యాన్స్ ...ఆమెను టార్గెట్ చేశారు. సోష‌ల్ మీడియాలో శ్రీ‌రెడ్డిని విప‌రీతంగా దూషిస్తూ.. కించపరుస్తూ.. అవమానిస్తూ.. బెదిరిస్తూ ట్రోల్ చేస్తున్నారు. న‌టుడు శివబాలాజీతో పాటు మ‌రికొంత‌మంది ప‌వ‌న్ అభిమానులు శ్రీ‌రెడ్డికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఓ చానెల్ స్టూడియోకు వ‌చ్చి వెళుతోన్న శ్రీ‌రెడ్డిని ప‌వన్ ఫ్యాన్స్ చేజ్ చేయ‌డం...పోలీసులు సాయంతో ఆమె ఇల్లు చేరుకోవ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో - ప‌వన్ అభిమానుల‌కు శ్రీ‌రెడ్డి ఫేస్ బుక్ లో వార్నింగ్ ఇచ్చింది. త‌న ఫేస్ బుక్ పేజీ పోలీసుల నిఘాలో ఉంద‌ని పోస్ట్ పెట్టింది.

తాను పీకేకు సారీ చెప్పాన‌ని - వ‌ర్మ ప్రోత్బ‌లంతో అలా అనాల్సి వ‌చ్చింద‌ని చెప్పినా కూడా పీకే ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆగ‌డం లేద‌ని శ్రీ‌రెడ్డి త‌న ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. త‌న ఎప్ బీ పేజీ పోలీసుల నిఘాలో ఉందని,త‌న‌ను ట్రోలింగ్‌ చేసేవాళ్లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాల‌ని హెచ్చ‌రించింది. ‘నా ఫేస్‌ బుక్‌ పేజీపై పోలీసుల నిఘా ఉంది. జాగ్రత్త గా ఉండండి. నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్ల‌ని బ్లాక్‌ చేయడం ఆపేశాను. పవన్‌ అభిమానుల ట్రోలింగ్ ను అందరికీ చూపించాలని మేం భావిస్తున్నాం. ఎన్‌ హెచ్‌ ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్‌)మ‌ద్దతు మాకుంది. జాతీయ - అంతర్జాతీయ మీడియా కూడా గమనిస్తోంది’ అని శ్రీ‌రెడ్డి త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. మ‌రోవైపు, కొంద‌రు పెద్దలు తెలివైన గేమ్స్‌ ఆడుతూ.. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మరో పోస్టు పెట్టింది.