Begin typing your search above and press return to search.

ఎగ్జిట్‌ పోల్స్‌ పై హీరో కౌంటర్‌

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:55 PM GMT
ఎగ్జిట్‌ పోల్స్‌ పై హీరో కౌంటర్‌
X
దేశంలోని అయిదు రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఫలితాలు వెళ్లడి అయ్యాయి. తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ పార్టీ గెలుపొందగా - ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రాభవం కనిపించలేదు. అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం రాజస్థాన్‌ - చతీస్‌ ఘడ్‌ - మహారాష్ట్రల్లో బీజేపీ గెలుస్తుందంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఇచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ మరింతగా ఆ రాష్ట్రాల్లో బలహీన పడ్డట్లుగా అంచనా వేశారు. కాని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తారు మారు అయ్యాయి. దాంతో ఎగ్జిట్‌ పోల్స్‌ పై హీరో సిద్దార్థ్‌ కౌంటర్‌ వేశాడు.

ఒక మీడియా సంస్థ వెలువరించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ట్యాగ్‌ చేసి దానికి రీప్లై ఇస్తూ... ఇక మీరు ఎగ్జిట్‌ అయితే బాగుంటుంది అంటూ కామెంట్‌ చేశాడు. తప్పుడు సర్వేలను చూపించే మీడియా సంస్థలు ఇకనైనా అలాంటి పద్దతికి దూరంగా ఉండాలంటూ సిద్దార్థ్‌ పోస్ట్‌ కు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఫేక్‌ న్యూస్‌ లను మీడియా సంస్థలు పబ్లిసిటీ చేయవద్దని సిద్దార్థ్‌ కోరాడు.

ఈ మద్య కాలంలో మీడియా సంస్థలు మెవరిస్తున్న ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో నిజం ఎంతో అనే విషయంపై క్లారిటీ లేకుండా ఉంది. కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు మద్దతుగా సర్వే ఫలితాలను వెళ్లడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే సిద్దార్థ్‌ అలాంటి కామెంట్‌ చేశాడు.