Begin typing your search above and press return to search.

జూ. బచ్చన్‌ నిర్మొహమాటంగా చెప్పేశాడు!

By:  Tupaki Desk   |   15 Nov 2018 12:01 PM GMT
జూ. బచ్చన్‌ నిర్మొహమాటంగా చెప్పేశాడు!
X
సౌత్‌ లో హీరోల పారితోషికం, హీరోయిన్స్‌ పారితోషికంల విషయంలో చాలా తేడా ఉంటుంది. హీరోల పారితోషికంకు హీరోయిన్స్‌ పారితోషికంకు సంబంధం లేకుండా ఉంటుంది. రెండు కోట్లు హీరోయిన్‌ తీసుకుంటుంది అంటే అదో గొప్ప విషయం. అదే హీరో 10 నుండి 20 కోట్లు కూడా సౌత్‌ లో తీసుకుంటూ ఉన్నాడు. హీరోల స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ఇతర సౌత్‌ సినిమా పరిశ్రమల్లో హీరోయిన్స్‌ కు పారితోషికం దక్కడం లేదు అంటూ మొదటి నుండి హీరోయిన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే బాలీవుడ్‌ లో మాత్రం ఈ పరిస్థితి లేదు. కొన్ని సందర్బాల్లో, కొన్ని సినిమాల్లో హీరోల కంటే కూడా అధికంగా హీరోయిన్స్‌ పారితోషికం తీసుకోవడం మనం చూడవచ్చు.

తాజాగా ఆ విషయంపై జూనియర్‌ బచ్చన్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు. అభిషేక్‌ బచ్చన్‌ తాజాగా తన భార్య ఐశ్వర్య రాయ్‌ పారితోషికం విషయమై మాట్లాడుతూ.. నేను నా భార్య ఐశ్వర్య కలిసి 9 సినిమాలు చేశాం. ఆ 9 సినిమాల్లో 8 సినిమాలకు గాను నాకంటే ఎక్కువ పారితోషికంను ఐశ్వర్య తీసుకుందని నిర్మొహమాటంగా, నిసిగ్గుగా తేల్చి చెప్పాడు. ఐశ్వర్య రాయ్‌ క్రేజ్‌ ప్రకారం ఆమె పారితోషికం తీసుకుంటుందని పేర్కొన్నాడు. ఒక సినిమా కోసం తన తండ్రి అమితాబచ్చన్‌ కంటే, ఇర్ఫాన్‌ ఖాన్‌ కంటే కూడా అధికంగా దీపిక పదుకునే పారితోషికం తీసుకుంది.

సినిమా పరిశ్రమ అనేది క్రేజ్‌ ను బట్టి పారితోషికం తెచ్చి పెడుతుంది. బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వగానే నాకు షారుఖ్‌ ఖాన్‌ స్థాయిలో పారితోషికం ఇస్తేనే నటిస్తాను అంటూ ఎవరు కూడా ఛాన్స్‌లు ఇవ్వరు అంటూ అభిషేక్‌ బచ్చన్‌ చెప్పుకొచ్చాడు. సోషల్‌ మీడియాలో అభిషేక్‌ బచ్చన్‌ గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భార్య సంపాదనతో విదేశాలు తిరిగే వ్యక్తి అంటూ అభిషేక్‌ బచ్చన్‌ గురించి కామెంట్స్‌ వినిపిస్తూ ఉంటాయి. అయితే అభిషేక్‌ మాత్రం వాటిని చాలా లైట్‌ గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటాడు. ప్రస్తుతం ఐశ్వర్యతో కలిసి ఒక చిత్రాన్ని అభిషేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చేస్తున్న సినిమాకు కూడా ఐశ్వర్య కంటే అభిషేక్‌ తక్కువ పారితోషికం తీసుకుని ఉంటాడు.