Begin typing your search above and press return to search.

బోనీక‌పూర్ ఇద్ద‌రి భార్య‌ల మృతిలోనూ ఒక‌టి కామ‌న్‌

By:  Tupaki Desk   |   25 Feb 2018 7:48 AM GMT
బోనీక‌పూర్ ఇద్ద‌రి భార్య‌ల మృతిలోనూ ఒక‌టి కామ‌న్‌
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మ‌ర‌ణం యావ‌ద్దేశాన్ని శోకంలో నింపేసింది. ఒక సినీన‌టి మ‌ర‌ణిస్తే మ‌రీ ఇంత ఇదైపోవాల‌న్న మాట‌ను ఎవ‌రైనా అంటే.. అత‌డికి సినిమా రంగంతో పెద్ద ప‌రిచ‌యం లేకుండా ఉండి ఉండాలి. లేదంటే.. తేడా అయినా అయి ఉండాలి. నాలుగేళ్ల వ‌య‌సులో మొద‌లైన ఆమె సినీ ప్ర‌యాణం చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ సాగుతూనే ఉంద‌ని చెప్పాలి.

స్వ‌శ‌క్తితో ఎదుగుతూ.. ఎదురుదెబ్బ‌ల‌కు వెర‌వ‌కుండా.. ఎంత‌కూ అర్థంకాని ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర వేయ‌ట‌మే కాదు.. ఒక త‌ల్లిగా త‌న పాత్ర‌కు సంపూర్ణ న్యాయం చేయ‌టం ఒక ఎత్తు అయితే.. భార‌త చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆమె సాటి వ‌చ్చే మ‌హిళా న‌టి మ‌రొక‌రు ఉండ‌రేమో..?

ఆమె మ‌ర‌ణం అంద‌రిని క‌లిచివేస్తోంది. సినిమా రంగంలో అవ‌కాశాలు త‌గ్గు ముఖం ప‌డుతున్న వేళ‌.. అప్ప‌టికే పెళ్లి అయిన ప్ర‌ముఖ నిర్మాత బోనీక‌పూర్ ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. బోనీ క‌పూర్ మొద‌టి భార్య మోనా క‌పూర్. ఆమె 2012లో మ‌ర‌ణించారు. ఆమె మ‌ర‌ణంలోనూ.. తాజాగా శ్రీ‌దేవి మ‌ర‌ణంలో ఒక పోలిక ఉండ‌టం గ‌మ‌నార్హం.

త‌న కొడుకు అర్జున్ క‌పూర్ ను వెండితెర మీద చూసుకోవాల‌ని మోనా క‌పూర్ త‌పించారు. ఇందుకోసం ఆమె చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. అర్జున్ క‌పూర్ న‌టించిన తొలిచిత్రం విడుద‌ల‌కు కేవ‌లం రెండు నెల‌ల ముందు ఆమె కేన్స‌ర్ తో మ‌ర‌ణించారు. ఆమె మ‌ర‌ణంతో అర్జున్ క‌పూర్ తొలిచిత్రం విడుద‌ల కాస్త ఆల‌స్య‌మైంది.

ఇదిలా ఉంటే.. శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాహ్న‌విని వెండితెర మీద చూసుకోవాల‌నిశ్రీ‌దేవి ఎంత‌గానో త‌పించారు. ఆమెకు స‌రైన ఫ్లాట్ ఫాం కోసం చేసిన కృషి అంతా ఇంతా కాదు. అతిలోక సుంద‌రి ఇమేజ్ ఉన్న త‌న కుమార్తెను అంతే అందంగా స్క్రీన్ మీద ప్ర‌జెన్స్ ఉండేందుకు శ్రీ‌దేవి ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాద‌ని చెబుతారు.

తాజాగా జాహ్న‌వి న‌టిస్తున్న ధ‌డ‌క్ చిత్రం ఈ ఏడాది జులైన 14న విడుద‌ల కావాల్సి ఉంది. ఈ చిత్రం విడుద‌ల‌కు నాలుగు నెల‌ల ముందు శ్రీ‌దేవి అనూహ్యంగా మృతి చెంద‌టం గ‌మ‌నార్హం. బోనీక‌పూర్ మొద‌టి భార్యే కాదు.. రెండో భార్య సైతం త‌న వార‌సుల్ని వెండితెర మీద వెలిగిపోతున్న తీరును చూసి మురిసిపోవాల‌నుకోవ‌టం.. అది సాధ్యం కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.