Begin typing your search above and press return to search.

రాజ‌కీయ నేత‌లు రాస్కెల్స్‌...మోహ‌న్‌ బాబు

By:  Tupaki Desk   |   19 Jan 2018 1:33 PM GMT
రాజ‌కీయ నేత‌లు రాస్కెల్స్‌...మోహ‌న్‌ బాబు
X
తిరిగి రాజ‌కీయాల్లో వ‌స్తానంటూ కొద్దికాలం ప్ర‌క‌టించిన మాజీ ఎంపీ - ప్ర‌ముఖ సినీన‌టుడు మోహ‌న్‌ బాబు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ 2018లో భాగంగా రెండో రోజు నిర్వ‌హించిన చ‌ర్చాగోష్టిలో ఆయ‌న పాల్గొన్నారు. "ఫాదర్ టు డాటర్: డిఎన్ ఎ ఆఫ్ యాక్టింగ్" అనే పేరుతో జరిగిన సెషన్‌ లో తన కూతురు మంచు లక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ ఉన్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తన స్నేహితుడు - తనకు అన్న అయిన ఎన్టీ రామారావు చాలా మంచి వ్యక్తి అని - లంచం ఏమిటో కూడా ఎన్టీఆర్‌ కు తెలియదని మోహన్ బాబు అన్నారు. తనను ఎన్టీఆర్ రాజ్యసభకు పంపించారని, ఎటువంటి మచ్చ లేకుండా తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ చ‌ర్చ‌లో మోహ‌న్‌ బాబు మాట్లాడుతూ భార‌త‌దేశం ప్ర‌స్తుత ప‌రిస్థితికి రాజ‌కీయ నాయ‌కులే కార‌ణ‌మ‌ని....95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తున్నారని అంటూ వాటిని నిలబెట్టుకునే వారెవరు అని ప్రశ్నించారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని మోహన్ బాబు అన్నారు. రాజకీయ నాయకులు మాట నిలబెట్టుకుని ఉంటే భారతదేశం ఇంకా మంచి స్థానంలో ఉండేదని ఆయన అన్నారు. అలాంటి నాయ‌కులు లేక‌పోవ‌డం వ‌ల్ల దేశం ఇంకా అభివృద్ధిని సాధించేంద‌ని - కానీ అలాంటి అవ‌కాశం త‌ప్పిపోయింది పొలిటీషియ‌న్ల వ‌ల్లేన‌ని మోహ‌న్‌బాబు మండిప‌డ్డారు.

తన దృష్టిలో సినిమాలు - రాజకీయాలు వేర్వేరు అని మోహ‌న్ బాబు తెలిపారు. రాజ‌కీయాల్లో ఉన్న స‌మ‌యంలో తాను చిత్త‌శుద్ధితో ప్ర‌జా సేవ‌కు అంకితం అయ్యాన‌ని అన్నారు. తనను ఎన్టీఆర్ రాజ్యసభకు పంపించారని - ఎటువంటి మచ్చ లేకుండా తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. తన అన్న అయిన ఎన్టీ రామారావు చాలా మంచి వ్యక్తి అని, లంచం ఏమిటో కూడా ఎన్టీఆర్‌కు తెలియదని మోహన్ బాబు చెప్పారు. ఆయ‌న ప‌రిపాల‌న నాయ‌కుల‌కు ఆద‌ర్శ‌మ‌ని వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా మంచు ల‌క్ష్మీ మాట్లాడుతూ త‌న‌ తండ్రి మోహన్ బాబు త‌న‌కు రోల్ మోడ‌ల్ అని తెలిపారు. తన తండ్రి కింగ్ మేకర్ అని, సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లినవారి తరఫున ప్రచారం చేసి వారిని గెలిపించారని ఆమె చెప్పారు. కింగ్‌లా కాకుండా కింగ్ మేకర్‌లా ఉండాలని కోరుకున్నారని మంచు లక్ష్మి చెప్పారు. నిర్మొహమాటంగా - ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మోహన్ బాబు స్వభావమని ఆమె అన్నారు. ఇటు రాజ‌కీయాలు - అటు సినిమా రంగంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అనేక మందిలో స్పూర్తి నింపార‌ని వివ‌రించారు.