Begin typing your search above and press return to search.

హీరో తనీష్ కు 50 రూపాయల జరిమానా

By:  Tupaki Desk   |   6 Oct 2015 6:30 AM GMT
హీరో తనీష్ కు 50 రూపాయల జరిమానా
X
తాగి కారు నడుపుతూ బైకుపై వ్యక్తిని ఢీకొనడంతో పాటు అతడిపై దాడి చేసిన కేసులో యువ కథానాయకుడు తనీష్ కు నాంపల్లి కోర్టు 50 రూపాయల జరిమానా విధించింది. తనీష్ ఈనెల 1న రాత్రి 9 గంటలకు మద్యం తాగి వాహనం నడుపుకుంటూ వెళ్తూ జూబ్లీహిల్స్ రోడ్డులో బైకుపై వెళ్తున్న సురేష్ అనే వ్యక్తిని ఢీకొట్టి ముందుకు దూసుకుపోయాడన్నది అతడిపై ఆరోపణ. ఐతే బాధితుడు సురేష్ తన బైకుపైనే చేజ్ చేసి తనీష్‌ను అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది

తాగిన మైకంలో తనీష్ తనను దుర్భాషలాడాడని, దాడికి కూడా ప్రయత్నించాడని సురేష్ అదే రోజు రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సురేషే తనను దూషించాడని తనీష్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై జూబ్లీహిల్స్ పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనీష్ కోర్టుకు హాజరు కాగా న్యాయమూర్తి కేవలం 50 రూపాయల జరిమానా విధించారు. తనీష్ వెంటనే జరిమానా చెల్లించి వెళ్లిపోయాడు. ఐతే కారు నడిపినపుడు తనీష్ మద్యం తాగాడా లేదా అన్నది పోలీసులు నిర్ధారించకపోవడం, ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో న్యాయమూర్తి స్వల్పంగా జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఐతే మరీ యాభై రూపాయల జరిమానా విధించడం ఏమిటో?