Begin typing your search above and press return to search.

మహా భారతంలో మధుర ప్రేమకథలు

By:  Tupaki Desk   |   5 July 2015 12:36 PM GMT
మహా భారతంలో మధుర ప్రేమకథలు
X
మహాభారతం సాటిలేని మహా కావ్యం.. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం... రాజ్యకాంక్ష... ధైర్యం, నీతి, యుక్తి వంటి ఎన్నో పార్శ్వాలు చూపే మహాభారత కావ్యంలో ప్రేమ కథలూ ఉన్నాయి. వాటిలో కొన్ని అందరికీ తెలిసినవే అయినా.. ఇంకొన్ని మాత్రం ఎవరికీ పెద్దగా తెలియనవి.

ఇవీ మహాభారత లవ్‌ స్టోరీలు

- 16.108 భార్యలున్న శ్రీకృష్ణుడిని మించిన ప్రేమకథానాయకుడు మహాభారతంలో ఇంకెవ్వరూ లేరు. పట్టపు రాణులతో పాటు ఆయన వేలాదిమంది గోపికలను పెండ్లాడడం విశేషం. అనంతమైన ప్రేమనందించే శక్తిగల గోపాలుడిని ఆరాధించేవారు కూడా ఆయన ప్రేమలో మునిగిపోతారని చెబుతుంటారు.

- రుక్మిణి శ్రీ కృష్ణుల ప్రేమకథా గొప్పదే. రుక్మిణి కుటుంబసభ్యుల మాట కాదని శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి పెండ్లాడుతాడు.

- అనుకోని పరిస్థితుల్లో అయిదుగురిని పెళ్లాడిన ద్రౌపది వారిలో ప్రతి ఒక్కరికీ తన ప్రేమను అందిస్తుంది. పాండవులు అయిదుగురినీ వివాహమాడిన ఆమె వారందరి పట్ల తన బాధ్యత, ప్రేమ ఒకే రకంగా చూపగలగడం గొప్ప విషయం.

- గాంధారి-ధృతరాష్ట్రుడు: గాంధారి, ధృతరాష్ట్రుల ప్రేమ కథ వారి వివాహం తర్వాత ప్రారంభమవుతుంది. భర్తకు కళ్లు లేకపోవడంతో ఆయన లోకాన్ని చూసి ఆనందించలేకపోతున్నాడని... ఆయనకు లేని ఆనందం తనకెందుకుని గాంధారి కూడా చూపును త్యజిస్తుంది. జీవితాంతం కళ్లకు గంతలు కట్టుకుని గడిపింది.

- అర్జునుడి ప్రేమకథలు: ఉలూపి అనే ఒక నాగ యువరాణి అర్జునుడిని ప్రేమిస్తుంది. ద్రౌపదిని కూడా కాదని అర్జునుడు తనను ప్రేమించేలా చేయగలుగుతుంది.

- అర్జునుడు, చిత్రాంగద... చిత్రాంగద, మణిపూర్‌ యువరాణి. నది కావేరి ఒడ్డున ఉన్న మణిపూర్‌ కు రాజు చిత్రవాహన ఉండగా, అర్జునుడు దీనిని సందర్శించాడు. అతని కుమార్తె చిత్రాంగద, చాలా అందమైనది. అర్జునుడు ఆమెను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. చూపు తిప్పుకోలేనంతటి సౌందర్యవతి అయిన చిత్రాంగద ప్రేమలో పడి ఆమెకు ఆ విషయం చెబుతాడు. ఆమెను వివాహం చేసుకుంటానని ఆమె తండ్రిని అడిగినప్పుడు, ఆమె తండ్రి వారి పిల్లలు మణిపూర్‌ లో పెరగాలని, సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు. అర్జునుడు అంగీకరించాడు. బబ్రువాహనుడు జన్మించిన తరువాత, అర్జునుడు భార్యను, కొడుకును వొదిలి తన సోదరులతో వెళ్తాడు. చిత్రవాహనుడి మరణం తరువాత బబృవాహనుడు మణిపూర్‌ రాజ్యానికి రాజవుతాడు. మహాభారత యుద్ధం తరువాత అర్జునుడు తన కుమారుడైన బబృవాహనుడి చేతిలో ఓడిపోతాడు.

- అర్జునుడు, సుభద్ర... అర్జునుడు, సుభద్రల ప్రేమకథకూ మహాభారతంలో ప్రాధాన్యం ఉంది. అజ్ఞాతవాసం తరువాత, అర్జునుడు ద్వారకకు చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు సోదరి అయిన సుభద్రకు, అర్జునుడికి మధ్య ప్రేమ చిగురించింది. కృష్ణుడే సుభద్రణు అపహరించమని అర్జునుడికి సలహా ఇచ్చాడు. సుభద్రను స్వీకరించడానికి ద్రౌపది అంగీకరిస్తుంది.

- భీముడు, కుంతి కుమారుడు. హిడింబ నరభక్షకురాలు. ఆమె భీముడితో ప్రేమలో పడిపడుతుంది.... పూర్తిగా మారిపోయి భీముడి ప్రేమలో పడి సుగుణవతిగా మారిపోతుంది. హిడింబి, భీముడిల కుమారుడే ఘటోత్కచుడు.

- సత్యవతి, పరాశరులు.... పరాశరుడు భక్తి ద్వారా అనేక యోగ శక్తులను పొందిన ఒక ముని.. సత్యవతి పడవ నడిపే స్త్రీ. ఒకరోజు పరాశరుడు సత్యవతి నడిపే పడవలో వెళ్తూ ఆమెను కాంక్షిస్తాడు. ఆమె కోరిక మేరకు ఆమె శరీరం నుంచి వచ్చే చేపలవాసన పోయి పరిమళం వచ్చేలా చేస్తాడు. వారిద్దరికీ జన్మించినవాడే వేదవ్యాసుడు.