Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... జారిపడ్డ సీఎం, నుదుటన మళ్లీ గాయం!

"మేమంతా సిద్ధం" అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవాడలో జరుగుతున్న సమయంలో ఆయనపై దాడి జరిగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 April 2024 12:03 PM GMT
బిగ్ బ్రేకింగ్... జారిపడ్డ సీఎం, నుదుటన మళ్లీ గాయం!
X

"మేమంతా సిద్ధం" అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవాడలో జరుగుతున్న సమయంలో ఆయనపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా బ్యాండైడ్ తో కనిపించిన సీఎం... తాజాగా మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా మానిన గాయంతో, బ్యాండైడ్ లేకుండా కనిపించారు. అంతకంటే ముందు మరో రాష్ట్ర ముఖ్యమంత్రి తలకూ బలమైన గాయం అవ్వడం, దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడం తెలిసిందే.

ఇందులో భాగంగా... తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తలకూ బలమైన గాయం తగిలిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరోసారి ఆమె గాయపడ్డారు! దీంతో... ఆమెకు వరుసగా దెబ్బలు తగులుతున్నాయని.. అయినా కూడా ఆమె ఎక్కడా తగ్గకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆమె అభిమానులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఈ సమయంలో ఆమెకు మరోసారి నుదుటున గాయం అయ్యింది!

అవును... ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో... నేతలంతా వారి వారి నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు చేసుకుంటుండగా.. అధినేతలు మాత్రం హెలీకాప్టర్ లలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారాలు చేస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో... పశ్చిమ బెంగల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హెలీకాప్టర్ లలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో.. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరాలని ఫిక్సయ్యారు మమతా బెనర్జీ. దీంతో... ఆమె కోసం హెలీకాప్టర్ సిద్ధం చేశారు. ఈ సమయంలో... హెలికాప్టర్ ఎక్కి.. లోనికి వెళ్లిన అనంతరం సీటులో కూర్చోబోయే ముందు మమత బెనర్జీ కిందపడిపోయారు! దీనితో నుదుటికి గాయమైనట్లు చెబుతున్నారు. ఆమె హెలీకాప్టర్ లోకి ఎక్కగానే ఆమె పడిన వెంటనే శబ్ధం రావడంతో సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు.

ఈ సమయంలో... ఆమెకు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించారని తెలుస్తుంది. అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారు. అసన్‌ సోల్‌ కు బయలుదేరి వెళ్లారు. పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌ లో ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది!