Begin typing your search above and press return to search.

కూతురు పెళ్లి కోసం రూ. 490 కోట్లు ఖర్చు... ప్రత్యేకతలివే!

అందులో భాగంగా ఒక వ్యాపారవేత్త తన కుమార్తె పెళ్లిని అత్యంత ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకకు ఖర్చు చేసిన డబ్బు రికార్డ్ స్థాయిలో ఉంది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:12 AM GMT
కూతురు పెళ్లి కోసం రూ. 490 కోట్లు ఖర్చు... ప్రత్యేకతలివే!
X

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఆ వివాహ బంధం నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండాలని ఏ విధంగా అయితే కోరుకుంటారో.. అలాగే ఆ పెళ్లి వేడుకను పదికాలాల పాటు గుర్తుండిపోయేలా జరుపుకోవాలని అంతా భావిస్తుంటారు. అయితే, సామాన్యులు, మద్యతరగతి వారూ తమ పెళ్లి కోసం లక్షల్లో ఖర్చుపెడితే... ధనవంతులైతే ఇంకొంచెం ముందుకెళ్లి కోట్లలో ఖర్చు చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక వివాహం తాజాగా వార్తల్లో నిలిచింది.

అందులో భాగంగా ఒక వ్యాపారవేత్త తన కుమార్తె పెళ్లిని అత్యంత ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకకు ఖర్చు చేసిన డబ్బు రికార్డ్ స్థాయిలో ఉంది. స్పెషల్ ఫ్లైట్లలో అతిధులకు ఆహ్వానం, పాప్ సింగర్లతో కన్సర్ట్ ఏర్పాటు మొదలైన సంబరాలతో ఐదురోజుల పాటు జరిగిన ఆ వివాహ వేడుక సరికొత్త రికార్డ్ సృష్టించింది. దానికోసం వందల కోట్లు ఖర్చు చేశారు.

అవును... అమెరికాకు చెందిన బెంజికార్ల డీలర్ బాబ్ బ్రాక్ వే అనే వ్యాపారవేత్త కుమార్తె మ్యాడిలైన్ (26) వివాహాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. పారిస్ కు చెందిన జాకబ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కుమార్తె వివాహానికి రూ.490 కోట్లు ఖర్చు చేశారు. సుమారు ఐదు రోజులపాటు ఈ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఇక లగ్జరీ మ్యారేజ్ హాల్ లో ఈ వివాహ వేడుక జరగగా.. ఈ వివాహానికి హాజరయ్యే అతిధుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. ఇక ఆభరణాల సంగతి చెప్పేదేముంది! ఇదే సమయంలో అమెరికా పాప్ సింగర్లతో కన్సర్ట్ ను ఏర్పాటు చేశారు. టాప్ సెలబ్రెటీలు అతిధులుగా హాజరయ్యారు. విందు, వినోద కార్యక్రమాలతో సందడి సందడిగా ఈ కార్యక్రమం సాగింది.

కాగా... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా యువరాజు ఛార్లెస్, యువరాణి డయానాల వివాహం నిలిచిన సంగతి తెలిసిందే. ఈ వివాహం కోసం సుమారు 110 మిలియన్ డాలర్లపైనే ఖర్చు చేసి ఉంటారని అంటారు. అంటే... ఇండియన్ కరెన్సీలో రూ. 916 కోట్లకు పైనే అన్నమాట. ఇదే సమయంలో ఇషా అంబానీ – ఆనంద్ వివాహం కోసం సుమారు రూ. 400 కోట్లు ఖర్చు చేసినట్లు కథనాలొచ్చాయి!

ఇదే సమయంలో స్టీల్ ఇండస్ట్రీ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం కూడా అత్యంత ఖరీదైన వేడుకల్లో ఒకటిగా నిలిచిందని చెబుతారు. ఇక కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూడా తన కూతురి పెళ్లి కోసం భారీగానే ఖర్చు చేశారు! ఈ క్రమంలో తాజాగా బాబ్ బ్రాక్ వే కుమార్తె వివాహం కూడా ఈ జాబితాలో చేరింది.