Begin typing your search above and press return to search.

మీకు అభ్యర్థి గతిలేడు .. బండి మాస్ ర్యాగింగ్

‘’కరీంనగర్ లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా లేరు

By:  Tupaki Desk   |   21 April 2024 1:11 PM GMT
మీకు అభ్యర్థి గతిలేడు .. బండి మాస్ ర్యాగింగ్
X

‘’కరీంనగర్ లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా లేరు. బీఆర్ఎస్ లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తోంది, రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు’’ అని కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

"గతంలో బీఆర్ఎస్ వాళ్లు కేసులు పెట్టింది మాపైనేనని .. జైలుకు వెళ్లింది మేమేనని ..కానీ ప్రజలు ఓట్లు వేసింది మాత్రం కాంగ్రెస్ వాళ్లకు" అని బండి సంజయ్ చేసిన సిరిసిల్ల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ హామీల అమలును తప్పుపట్టడం వరకు ఓకే కానీ ప్రజల తీర్పును బండి సంజయ్ తప్పుపట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ లెక్కన ప్రశ్నిస్తే దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలు, తెలంగాణ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారు అన్న వాదన వినిపిస్తున్నది. బండి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎలా స్వీకరిస్తుంది ? ప్రజలు ఎలా స్పందిస్తారు ? అన్న ఉత్కంఠ నెలకొన్నది.