Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... వైఎస్సార్ ను చంపిందెవరు ఈయనకు తెలుసంట!

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో దివంగ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 6:52 AM GMT
వైరల్  ఇష్యూ... వైఎస్సార్  ను చంపిందెవరు ఈయనకు తెలుసంట!
X

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో దివంగ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకురావడమే కాకుండా... తనదైన సంక్షేమ పథకాలతో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ పేరుగా వైఎస్సార్ నిలిచిపోయారని అంటారు. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో వైఎస్సార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది ఎవరో తనకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్!

అవును... దివంగత వైఎస్సార్ మరణం గురించి ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఈ అంశంపై పలురకాల విమర్శలు తెరపైకి వస్తుంటాయి. ఈ సమయంలో తాజాగా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హత్య చేయించిందెవరో తనకు తెలుసని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ గా మారుతున్నాయి!

వివరాళ్లోకి వెళ్తే... నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీజేపీ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ అర్వింద్... తన జోలికి కాంగ్రెస్ నేతలు రావొద్దని.. చరిత్ర చదివించుకోవద్దనీ ఘాటుగా స్పందించారు. పదేండ్లు పాటు రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకు తింటే.. మూడు నెలల కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణను అధోగతి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలపై స్పందిస్తూ... వైఎస్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అర్వింద్.

ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీ నేతలు తనని టార్గెట్ చేసి మాట్లాడితే.. చిట్టా విప్పుతానని, అందరి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత చరిత్ర హీనులో డీ శ్రీనివాస్ కొడుకుగా తనకే ఎక్కువ తెలుసని అన్నారు. ఈ క్రమలోనే... రాజశేఖర్ రెడ్డిని చంపింది ఎవరో కూడా తనకు తెలుసని.. తన జోలికి కాంగ్రెస్ వాళ్లు రాకండి అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.