Begin typing your search above and press return to search.

రౌడీతో మైత్రీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా!

'శ్యామ్ సింగరాయ్' ఫేమ్ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 May 2024 5:07 PM GMT
రౌడీతో మైత్రీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా!
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటీవల 'ఫ్యామిలీ స్టార్' చిత్రంతో నిరాశ పరిచిన యువ హీరో.. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ పెట్టాడు. ఇందులో భాగంగా ఇప్పటికే రవి కిరణ్ కోలాతో ఓ రూరల్ యాక్షన్ డ్రామాని అనౌన్స్ చేసారు. ఈ క్రమంలో ఇంకో చిత్రాన్ని ప్రకటించడానికి రెడీ అయ్యారు.

'శ్యామ్ సింగరాయ్' ఫేమ్ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. అయితే రేపు మే 9న విజయ్ బర్త్ డే స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి రేపు ఉద‌యం 11.07 గంట‌ల‌కు ఓ ఎపిక్ అనౌన్స్ మెంట్ రాబోతోందని పేర్కొంటూ నిర్మాతలు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

మైత్రీ టీం వదిలిన పోస్టర్ లో హీరో విజయ్ దేవరకొండ అని కానీ, రాహుల్‌ సాంకృత్యాన్‌ డైరెక్టర్ అని కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కాకపోతే రేపు వీడీ పుట్టినరోజు కాబట్టి, ఆయన కొత్త ప్రాజెక్ట్‌ కు సంబంధించిన ప్రకటనే అని అర్థమవుతోంది. ఈ సందర్భంగా ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేస్తారని సమాచారం. ఇది 18వ శతాబ్దంలో సెట్ చేయబడిన పీరియడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే మేకర్స్ లేటెస్టుగా పంచుకున్న పోస్టర్ లో.. మద్రాస్ ప్రెసిడెన్సీ, మదురై, సిలోన్, కడప వంటి ప్రదేశాలతో కూడిన మ్యాప్ ను మనం గమనించవచ్చు.

గతంలో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్‌ కాంబినేషన్ లో వచ్చిన 'టాక్సీవాలా' సినిమా మంచి విజయం సాధించింది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ ఇంతకముందు 'డియర్ కామ్రేడ్' 'ఖుషి' వంటి మూవీస్ చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు వీరి ముగ్గురి కలయికలో రాబోతున్న పాన్ ఇండియా మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది. అందులోనూ ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథాంశమని, వీడీ తొలిసారిగా సీమ యాసలో మాట్లాడతారని అంటున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ తో వీటన్నిటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు చవిచూస్తున్న విజయ్ దేవరకొండ.. మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి వేటికవే ప్రత్యేకమైన స్టోరీలను సెట్ చేసుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేస్తున్న 'VD 12' సినిమా ఒక స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ అయితే, దిల్ రాజు ప్రొడక్షన్ లో అనౌన్స్ చేసిన #SVC59 ఒక రూరల్ యాక్షన్ డ్రామా. ఇప్పుడు మైత్రీ మేకర్స్ తో ప్రకటించబోయేది ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన అప్డేట్లు రేపు రౌడీ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా రాబోతున్నాయి.