Begin typing your search above and press return to search.

శర్వానంద్ మనమే.. అసలు ఆ బాబు గోలేంటి?

టాలీవుడ్‌ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్స్ లో శర్వానంద్‌ ఒక‌రన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2024 10:29 AM GMT
శర్వానంద్ మనమే.. అసలు ఆ బాబు గోలేంటి?
X

టాలీవుడ్‌ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్స్ లో శర్వానంద్‌ ఒక‌రన్న విషయం తెలిసిందే. కెరీర్ లో ఫీల్ గుడ్ జాన‌ర్ సినిమాల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చివరగా ఒకే ఒక జీవితం మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు వరుస చిత్రాలతో అలరించనున్నారు. కంటిన్యూ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు శర్వానంద్.

ప్రస్తుతం మనమే మూవీతో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు. సరికొత్త కథతో రాబోతున్న మనమే సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మేకర్స్ ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ పాట మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. సినిమాపై ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ లో ఆ సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు.

టీజర్ ను గమనిస్తే.. మనమే మూవీ అంతా లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. లండన్, యూరప్ చుట్టూ సినిమా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మంచివాడిగా కనిపించే బ్యాడ్ బాయ్ అంటూ హీరో చెప్పుకుంటుంటారు. అనుకోకుండా హీరోకు కృతి పరిచయమవుతుంది. అయితే వారిద్దరి జీవితంలోకి ఓ బాబు వచ్చాక వారి లైఫ్ ఎలా సాగిందనే విషయంపై సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో చిన్నారి నేపథ్యంలో సాగే సీన్స్ హైలైట్‌ గా నిలవనున్నట్లు సమాచారం. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లో కూడా బాబుతో శర్వానంద్‌ చూపించారు. ఆ బాబు శ్రీరామ్ ఆదిత్య కొడుకని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ కృతి శెట్టి గ్లింప్స్ లో డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంది. శర్వా కూడా చాలా స్టైలిష్గా కనిపించారు. ముఖ్యంగా గ్లింప్స్ లో డైలాగులు అదిరిపోయాయి. చివర్లో ఇద్దరిలో ఒకరే ఏడవండి అంటూ శర్వా చెప్పిన డైలాగ్ కామెడీగా ఉంది. మొత్తానికి గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటూ సాగుతోంది.

ఈ సినిమాలో శర్వానంద్, కృతి శెట్టితో పాటు సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.