Begin typing your search above and press return to search.

విడాకుల పుకార్ల‌పై స్పందించిన స్టార్ హీరో

దీపికా పదుకొణెతో ర‌ణ‌వీర్ బ్రేక‌ప్ అయ్యాడంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 May 2024 9:50 AM GMT
విడాకుల పుకార్ల‌పై స్పందించిన స్టార్ హీరో
X

దీపికా పదుకొణెతో ర‌ణ‌వీర్ బ్రేక‌ప్ అయ్యాడంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఆక‌స్మికంగా అత‌డు త‌న ఇన్ స్టా నుంచి పెళ్లి ఫోటోల‌ను తొల‌గించ‌డంతో ఈ పుకార్లు వైర‌ల్ అయ్యాయి. అయితే దీనిపై ఎట్ట‌కేల‌కు రణవీర్ సింగ్ స్పందించాడు. సోష‌ల్ మీడియాల్లో సాగుతున్న‌ అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టాడు. ముంబైలో జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో కనిపించిన రణ్‌వీర్ తన పెళ్లి, నిశ్చితార్థపు ఉంగరాలను తనకు అత్యంత ఇష్ట‌మైన ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ ఆభరణాలుగా పేర్కొన్నాడు. అత‌డి వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి విడాకుల ప్ర‌చారం ఫేక్ స‌మాచార‌మ‌ని తేలింది.

రణవీర్ సింగ్ - దీపికా పదుకొనేపై త‌ప్పుడు ప్ర‌చారం సాగుతోంది. అందుకే ర‌ణ‌వీర సింగ్ తెలివిగా ఈ ప్ర‌క‌ట‌న చేసారు. విలాసవంతమైన అంత‌ర్జాతీయ‌ ఆభరణాల బ్రాండ్‌కు భారతీయ ముఖం అయిన ర‌ణ‌వీర్ ఈ కార్యక్రమంలో గర్వంగా తన బంగారు బ్యాండ్‌ను ప్రదర్శించాడు. దాని ప్రాముఖ్యత గురించి చెప్పాడు. తన వివాహం -నిశ్చితార్థపు ఉంగరాల గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడాడు. తన ఎడమ చేతిని కెమెరాలకు చూపిస్తూ.. వేలికి ఉన్న ఉంగ‌రం ఎంత మ‌క్కువైన‌దో తెలిపాడు.

నాకు చాలా ఇష్టమైన ఉంగరాలలో ఇది ఒకటి. ఇది నా పెళ్లి ఉంగరం.. నా భార్య నాకు బహుమతిగా ఇచ్చింది. మరొకటి ప్లాటినం ఎంగేజ్‌మెంట్ రింగ్. వాస్తవానికి మా అమ్మ డైమండ్ చెవిపోగులు.. మా అమ్మమ్మ ముత్యాలు కానుక‌గా ఇచ్చారు.. అని తెలిపాడు. దీపికతో బ్రేక‌ప్ అయిందంటూ పుకార్లు మొద‌లైన‌ తర్వాత మీడియా దానిని చిలువ‌లు ప‌లువలు చేసింది. కానీ ర‌ణ‌వీర్ త‌న పెళ్లి విష‌య‌మై ఎంతో క‌మిట్ మెంట్ తో వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

2023లో త‌న సోష‌ల్ మీడియాల నుంచి పెళ్లి ఫోటోల‌ను దీపిక తొల‌గించ‌గా, ఇప్పుడు ర‌ణ‌బీర్ కూడా అదే ప‌ని చేసాడు. దీంతో ఇప్పుడు మ‌రోసారి విడాకుల ప్ర‌చారం ఊపందుకుంది. అయితే ఈ ఫోటోల‌ను వారు తొల‌గించ‌లేదు. ఆర్కైవ్ చేసి హైడ్ చేసార‌ని భావిస్తున్నారు.

అయితే మీడియా పుకార్లపై వ్యాఖ్యానించకూడదని ఇద్దరూ నిర్ణ‌యించుకున్నందుకు వాటిపై ఎవ‌రూ ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. దీపిక, రణ్‌వీర్‌లు ప్రస్తుతం తమ మొదటి బిడ్డ రాక‌ కోసం ఎదురుచూస్తున్నారు. తమ బిడ్డ సెప్టెంబర్ 2024లో వస్తుందని భావిస్తున్నట్లు గత నెలలో ఈ జంట ప్రకటించారు. ఇదిలా ఉండగా రోహిత్ శెట్టి చిత్రం `సింగం ఎగైన్`లో ఈ జంట‌ స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేస్కోబోతున్నారు. ర‌ణ‌వీర్ సింగ్ పాన్ ఇండియా సినిమాల్లో న‌టించేందుకు ఇటీవ‌ల హ‌నుమాన్ ద‌ర్శ‌కుడితో మంత‌నాలు సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.