Begin typing your search above and press return to search.

'పరదా' తీసిన అనుపమ.. ఏం చెప్పాలనుకుంటోంది?

కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Tupaki Desk   |   26 April 2024 1:39 PM GMT
పరదా తీసిన అనుపమ.. ఏం చెప్పాలనుకుంటోంది?
X

సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల టిల్లు స్క్వేర్ తో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. మాలీవుడ్ లో రెండేళ్ల తర్వాత 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ చేస్తోంది. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ మూవీతో పాటు అనుపమ 'సినిమా బండి' డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులతో ఓ చిత్రం చేస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ టైటిల్ ను నేడు అనౌన్స్ చేశారు మేకర్స్. లేడీ ఓరియెంటెడ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పరదా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఎప్పటినుంచో ఇదే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీలో మరో మలయాళం హీరోయిన్ దర్శనా రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు.

ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేస్తూ అనుపమ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పరదా లేకుండా అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రెడిషనల్ దుస్తుల్లో అనుపమ.. ఓణీతో ముఖాన్ని కప్పుకుని ఉన్న మరికొందరు అమ్మాయిలతో పాటు నిలబడి పోస్టర్ లో కనిపిస్తోంది. ఈ సినిమాలో అనుపమ డీ గ్లామరస్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాన్సెప్ట్ వీడియో విషయానికొస్తే.. ఫస్ట్ అమ్మవారి విగ్రహానికి గంతలు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఆ తర్వాత అనుపమ చుట్టూ ఉన్న వాళ్లంతా ముఖంపై ముసుగు వేసుకుని ఉంటే ఆమె ముసుగు తీసేస్తూ కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో పవిత్రమైన యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా శ్లోకం వినిపిస్తోంది. ఈ సినిమా సరికొత్త కథతో తెరకెక్కుతోందని కాన్సెప్ట్ వీడియో ద్వారా మేకర్స్ పరోక్షంగా తెలిపారు.

ఇక కాన్సెప్ట్ వీడియాను అనుపమ కూడా షేర్ చేసింది. "ఇప్పటి వరకు చేయని కథలు, పాత్రలతో మీ ముందుకు వస్తా అని చెప్పా కదా, బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత ఇప్పుడు 'పరదా' తో రాబోతున్నా" అని పోస్ట్ చేసింది. ఆనంద మీడియా బ్యానర్‌ పై శ్రీనివాసులు, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాలయాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.