Begin typing your search above and press return to search.

క్రాక్ డైరెక్టర్.. బాలీవుడ్ హీరోతో ఎంతవరకు వచ్చింది?

గత ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని నెక్స్ట్ మాస్ మహారాజ్ రవితేజతో మూవీ చేయాలని అనుకున్నారు

By:  Tupaki Desk   |   24 April 2024 4:30 PM GMT
క్రాక్ డైరెక్టర్.. బాలీవుడ్ హీరోతో ఎంతవరకు వచ్చింది?
X

గత ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని నెక్స్ట్ మాస్ మహారాజ్ రవితేజతో మూవీ చేయాలని అనుకున్నారు. అయితే ఆ సినిమాకి బడ్జెట్ ఎక్కువ కావడంతో హోల్డ్ లో పెట్టేశారని టాక్ వచ్చింది. ఇక దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే కథని బాలీవుడ్ సీనియర్ స్టార్ సన్నీ డియోల్ కి చెప్పగా ఆయన ఒకే చేశారని మరొక టాక్ వస్తోంది. హిందీ, తెలుగు భాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ వారే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సన్నీ డియోల్ చివరిగా గద్దర్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో అతని మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలోనే సన్నీ డియోల్ గోపీచంద్ చెప్పిన కథ నచ్చి ఒకే చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు చాలా కాలం నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు సన్నీ డియోల్, గోపీచంద్ మూవీతో వారికి గ్రాండ్ ఎంట్రీ లభిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇంటరెస్టింగ్ టాక్ బయటకొచ్చింది. జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని టాక్. మూవీలో ఫీమేల్ లీడ్ కోసం ఓ యంగ్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ని ఇతర పాత్రల కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.

జూన్ లో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. గద్దర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సన్నీ డియోల్ నుంచి రాబోతున్న మూవీ కావడంతో బాలీవుడ్ లో మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.

క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న గోపిచంద్ మలినేని ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడేమో వేచి చూడాలి. అలాగే రవితేజతో అనుకున్న కథని సన్నీ డియోల్ ఎంత వరకు న్యాయం చేస్తాడో చూడాలి. ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూపై త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బిటౌన్ లో వినిపిస్తోంది. ఇక మైత్రి వారికి ఈ సినిమా హిట్టవ్వడం చాలా ముఖ్యం. ఇప్పటికే కోలీవుడ్, మలయాళంలో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఈ సంస్థలో నెక్స్ట్ రాబోయే బిగ్గెస్ట్ మూవీ పుష్ప 2. ఆ సినిమాకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది. అది ఏమాత్రం హిట్టయినా కూడా మైత్రి వారికి బాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరగడం పక్కా.