Begin typing your search above and press return to search.

ఆ స్టార్ తో ఆర్య చేయాలనుకున్న దిల్ రాజు..?

గంగోత్రి సినిమా చేసిన అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పూర్తి స్థాయి మేకోవర్ తో చేసిన సినిమా ఆర్య

By:  Tupaki Desk   |   8 May 2024 6:35 AM GMT
ఆ స్టార్ తో ఆర్య చేయాలనుకున్న దిల్ రాజు..?
X

గంగోత్రి సినిమా చేసిన అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పూర్తి స్థాయి మేకోవర్ తో చేసిన సినిమా ఆర్య. మొదటి సినిమాతోనే సుకుమార్ తన మార్క్ చూపించాడు. ఫీల్ మైల్ లవ్ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ తో ఒక సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. సూపర్ హిట్ సినిమా ఆర్య 20 సక్సెస్ ఫుల్ ఇయర్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దిల్ రాజు ఆర్య టీం గెట్ టు గెదర్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఆర్య సినిమా గురించి ఆ టైం లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చిత్ర యూనిట్ చెప్పారు.

దిల్ సినిమాకు రైటర్ గా పనిచేసిన సుకుమార్ ఆ సినిమా హిట్ ఐతే అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అని చెప్పారట దిల్ రాజు. దిల్ షూటింగ్ టైం లోనే మాంటేజ్ షాట్ చెప్పడంతో డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని చెప్పిన దిల్ రాజు అలా చెప్పిన మాట ప్రకారం దిల్ హిట్ అవ్వగానే సుకుమార్ ని పిలిచి కథ చెప్పమన్నారు.

ఆర్య కథ చెప్పగానే ముందు కాస్త డౌట్ పడ్డా తర్వాత ఓకే అన్నారు. సినిమా కథను ప్రభాస్ కి చెప్పించగా ప్రభాస్ ఇది తనకు సూట్ అవ్వదని చెప్పేశాడట. రవితేజ కూడా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే దిల్ సినిమా తరుణ్ కి స్పెషల్ షో వేసే టైం లో అల్లు అర్జున్ కూడా అటెండ్ అవగా తన సినిమాలో హీరో క్యారెక్టర్ కు అతను పర్ఫెక్ట్ అని దిల్ రాజుకి చెప్పారట సుకుమార్.

అలా అల్లు అర్జున్ కి కథ చెప్పడం.. అతనికి నచ్చడం ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగిందట. అల్లు అర్జున్ కి కథ నచ్చినా అల్లు అరవింద్ గారు కొన్ని మార్పులు సూచించారట. అది నచ్చని సుకుమార్ మళ్లీ ఊరెళదామని అనుకున్నారట. ఎలాగోలా దిల్ రాజు సర్దిచెప్పి సినిమా ఓకే చేయించుకున్నారు.

ఆర్య చేస్తున్న టైం లో సుకుమార్ తో తనకు గొడవలయ్యేవని.. సినిమా అంతా అయిపోయి ఎడిటింగ్ టేబుల్ మీద కూడా ఒక షాట్ కావాలని చేయించాడని అన్నారు దిల్ రాజు. అప్పటికి ఒక సినిమా అనుభవమే ఉన్న తనకు ఆర్య సినిమా సక్సెస్ మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఈ సినిమా టైం లో ఎంత హంగామా జరిగినా సినిమా సక్సెస్ అందరికీ మంచి కెరీర్ ఇచ్చింది.

ఆర్య ఫర్ ఎవర్.. ఆ సినిమాతో అందరి లైఫ్ టర్న్ అయ్యింది. ఈ సినిమాకు పనిచేసిన అందరు ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. అల్లు అర్జున్ పుష్ప తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దేవి శ్రీ ప్రసాద్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇలా ఆర్య సినిమాకు పనిచేసిన వారంతా కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇలా వారందరినీ కలిసి ఇలా ఒక ఈవెంట్ నిర్వహించడం కూడా మంచి అనుభూతి అని అన్నారు దిల్ రాజు.